విజయవాడ ఇంద్రకీలాద్రిపై పొంచి ఉన్న ప్రమాదం
danger on indra keeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం పొంచి ఉంది. వర్షాలకు నాలుగు అంగుళాల మేర కొండ బీటలు వారింది. దీంతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
చిన్న చిన్న రాళ్లు దొర్లి పడుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 2,3 రోజుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇంజినీరింగ్ అధికారులు.