Andhra Pradesh: సోము వీర్రాజుపై అసంతృప్తిలో ఏపీ బీజేపీ నేతలు.. ఢిల్లీలో కీలక నేతలతో భేటీ

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పలువురు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరికొందరు నేతలు కూడా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Andhra Pradesh: సోము వీర్రాజుపై అసంతృప్తిలో ఏపీ బీజేపీ నేతలు.. ఢిల్లీలో కీలక నేతలతో భేటీ

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ నేతల మధ్య మెల్లిగా విబేధాలు ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పలువురు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

మరికొందరు నేతలు కూడా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ చేరుకున్న నేతలు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏపీ బీజేపీ ఇంఛార్జ్ మురళీధరన్‌తో భేటీ కానున్నారు. పలు జిల్లాలకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షులు, వివిధ స్థాయిల్లో పని చేసిన నేతలు మురళీధరన్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి ఆయనకు వివరిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు, కీలక పదవుల్లో ఉన్న నాయకత్వాన్ని మార్చాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేసే అవకాశం ఉంది.

ఢిల్లీలో మురళీధరన్‌తో భేటీ కానున్న వారిలో రాష్ట్ర బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్, టెక్కలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్, కృష్ణాజిల్లా మాజీ అధ్యక్షుడు కుమారస్వామి, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కె.బాజి, బొడ్డు నాగలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల మాజీ అధ్యక్షులతోపాటు పలువురు నేతలున్నారు.