Visakha Agency : ఎన్ కౌంటర్, ఆరుగురు మావోయిస్టుల మృతి, తెలంగాణ వాసి సందె గంగయ్య మృతి!

కాల్పుల మోతతో అడవి మరోసారి దద్దరిల్లింది. విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కొయ్యూరు మండలం వంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Visakha Agency : ఎన్ కౌంటర్,  ఆరుగురు మావోయిస్టుల మృతి, తెలంగాణ వాసి సందె గంగయ్య మృతి!

Encounter at Visakha Agency: కాల్పుల మోతతో అడవి మరోసారి దద్దరిల్లింది. విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కొయ్యూరు మండలం వంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన సందె గంగయ్య చనిపోయినట్లు సమాచారం.

కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో పలువురు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, కార్బన్, తపంచాను స్వాధీనం చేసుకున్నారు.

2021, జూన్ 16వ తేదీ బుధవారం అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులకు పోలీసులు తారసపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో గ్రే హౌండ్స్ దళాలు ఎదురుకాల్పులు జరిపారు. రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల మోతతో అటవీ ప్రాంతం దద్ధరిల్లింది.

మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. అనంతరం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని తరలించారు. ఇంకా మావోయిస్టులు ఉన్నారనే దానిపై పోలీసులు కూంబింగ్ విసృతం చేపట్టారు. సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేపట్టారు.