CM Jagan : కరోనా రోగులకు ఉచితంగా చికిత్స : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan : కరోనా రోగులకు ఉచితంగా చికిత్స : సీఎం జగన్

Cm Jagan

Free treatment for corona patients: CM Jagan : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, సంసిద్ధతపై ప్రధానంగా చర్చించారు.

నిత్యం సగటున 1.4 లక్షల మందికి టీకాలను వేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం తగినన్ని డోసులు లేవని.. కేవలం రెండు రోజులకు సరిపడా నిల్వలే అందుబాటులో ఉన్నాయని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా టీకాలు వచ్చేలా చూడాలన్నారు.

రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి టీకాలు వేయాలని ఆదేశించారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి ఆస్కారం ఉండకూడదన్నారు. కరోనా రోగులకు రూ.1 ఖర్చు లేకుండా చికిత్స అందించాలని స్పష్టం చేశారు.