Gold Smuggling : పద్మావతి ట్రావెల్స్లో మూడేళ్లుగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్!
మరోవైపు భారీగా లభ్యమైన బంగారం, నగదుపై ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ కేసులో అరెస్టైన బస్సు డ్రైవర్లను విచారించేందుకు రెడీ అయ్యింది.
Gold smuggling : పద్మావతి ట్రావెల్స్ బస్సుల్లో అక్రమంగా నగదు, బంగారం తరలింపు ఏళ్లుగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్టు సమాచారం. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బంగారు వ్యాపారులకు బంగారం అందుతుండగా.. వారు డబ్బుకట్టలను పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ దందా అంతా పద్మావతి ట్రావెల్స్ బస్సుల్లోనే కొనసాగుతుంది. రామవరప్పాడు రింగ్లో రమేశ్, సురేశ్, రామకృష్ణా బస్సులకు బంగారం అందజేస్తున్నారు. బిస్కెట్లు, అచ్చులు, ఆభరణాల రూపంలో ఉన్న బంగారాన్ని వీరు బస్సుల్లో లోడ్ చేస్తున్నారు. పంపిన ప్రతిసారి 10కేజీల బంగారాన్ని తరలిస్తున్నారు.
ఇలా పంపిన బంగారాన్ని విశాఖ, సోంపేట, నరసన్నపేటలో ఉన్న బంగారం వ్యాపారులకు అందుతుంది. దీనికి ప్రతిగా వారు డబ్బును మళ్లీ అవే పద్మావతి ట్రావెల్స్ బస్సుల్లో తిరిగి పంపుతున్నారు. మొత్తం 12 మంది వ్యాపారులు ఈ దందా చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ 12 మంది వ్యాపారులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు భారీగా లభ్యమైన బంగారం, నగదుపై ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ కేసులో అరెస్టైన బస్సు డ్రైవర్లను విచారించేందుకు రెడీ అయ్యింది. డబ్బు, బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దందాను నడిపేవారు ఎవరు? బంగారం, డబ్బు లెక్కల్లోని డబ్బేనా? అన్న కోణంలో విచారించనున్నారు అధికారులు.
Heavy Cash Seize : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.5 కోట్లు పట్టివేత
ఇప్పటికే ట్రావెల్స్ ఉద్యోగులను పలు కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. బంగారం, డబ్బు అక్రమ రవాణా విషయం ఉద్యోగులకు తెలుసా? లేదా? అన్న విషయాలను కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. అసలు ట్రావెల్స్ యజమాని ఎక్కడున్నాడనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.