AP High Court: గూగుల్ మ్యాప్‌లు అబద్దాలు చెబుతాయా? రిషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

రిషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తవ్వకాలపై కమిటీకి అభ్యంతరం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంలో విభిన్న వైఖరిలు ఏంటి? అంటూ ప్రశ్నించింది. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తుంది అంటూ హైకోర్టు పేర్కొంది

AP High Court: గూగుల్ మ్యాప్‌లు అబద్దాలు చెబుతాయా? రిషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

AP High Court

AP High Court: రిషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తవ్వకాలపై కమిటీకి అభ్యంతరం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. గురువారం హైకోర్టులో రిషికొండ అక్రమ తవ్వకాలు విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ది పేరిట కొండలను కొట్టేస్తున్నారంటూ పేర్కొంది. మరో వైపు అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారు. ప్రభుత్వంలో విభిన్న వైఖరిలు ఏంటి? అంటూ ప్రశ్నించింది. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తుంది అంటూ హైకోర్టు పేర్కొంది.

AP High Court Jobs : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో కోర్టు మాస్టర్ , పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీ

కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయమని పంపుతామని, కమిటీ వేస్తే మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు కే.ఎస్‌ మూర్తి, అశ్వినీ కుమార్ లు హైకోర్టుకు తెలిపారు. గూగుల్ మ్యాప్‌లను పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు అందజేశారు. అయితే, తాము 9.88 ఎకరాలకే పరిమితమయ్యామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకు వివరించే ప్రయత్నం చేయగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా అంటూ ప్రశ్నించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తాను ఆఫిడవిట్ దాఖలు చేస్తానని, అప్పటివరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి న్యాయమూర్తిని కోరాడు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టుగా ఉందంటూ హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. మీరు అఫిడవిట్ వేసిన తరువాత నిజా, నిజాలు తేలుస్తామని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశిస్తూ ధర్మాసనం పేర్కొంది. దీంతో కేసు విచారణను ధర్మాసనం నవంబర్ 3కు వాయిదా వేసింది.