Rayapati Sambasiva Rao : చంద్రబాబు చెబితే నరసరావుపేట నుంచి పోటీ చేస్తా : రాయపాటి

ఏదైనా కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం మంచిదని సూచించారు. కొత్తవాళ్లకు అని కాదు.. కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్లివ్వాలని కోరారు. కన్నాకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా గెలుస్తారు.. తామంతా సపోర్ట్ చేస్తామని వెల్లడించారు.

Rayapati Sambasiva Rao : చంద్రబాబు చెబితే నరసరావుపేట నుంచి పోటీ చేస్తా : రాయపాటి

Rayapati Sambasiva Rao

Rayapati Sambasiva Rao : పల్నాడు జిల్లా టీడీపీ రాజకీయాలపై టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పోటీ చేయమంటే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తాను ఇప్పుడు పోటీకి సిద్ధమన్నారు. గతంలో డబ్బుల్లేక ఓడిపోయానని.. ఇప్పుడు డబ్బులున్నాయని చెప్పారు. అయినా ఈసారి డబ్బుల్లేకున్నా.. టీడీపీకి వేవ్ వస్తుందన్నారు. తన తనయుడు రంగబాబుకు సీటిమ్మని కోరుతున్నామని తెలిపారు. రంగబాబుకు సత్తెనపల్లి ఇస్తారా..? పెదకూరపాడు ఇస్తారా..? అనేది చంద్రబాబు ఇష్టం అన్నారు.

తమ తమ్ముడు కూతురు రాయపాటి శైలజకూ టిక్కెట్ అడుగుతున్నామని పేర్కొన్నారు. వాళ్లిద్దరికీ టిక్కెట్ ఇస్తే.. తనకు టిక్కెట్ లేకున్నా ఫర్వాలేదని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ కు లోకల్ వాళ్లే అభ్యర్థిగా ఉండాలన్నారు. కడప నుంచి వచ్చే బీసీకి టిక్కెట్ ఎందుకివ్వాలి..? లోకల్ బీసీలు లేరా..? అని ప్రశ్నించారు. కడప నుంచి వచ్చి పోటీ చేస్తే నరసరావుపేటలో గెలవడం కష్టం అన్నారు. తనకు ఇవ్వకుంటే వేరేవారికైనా టిక్కెట్ ఇవ్వండి.. కానీ లోకల్ వాళ్లకే ఇవ్వాలని సూచించారు.

Rayapati Sambasiva Rao : వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకమవుతాయి- మాజీ ఎంపీ హాట్ కామెంట్స్

తాను ముసలివాణ్ని అయిన మాట వాస్తవమే.. కానీ అన్ని చోట్లా తిరుగుతానని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో కలిసే పని చేస్తామని, వర్గాలు లేవని స్పష్టం చేశారు. తాను ఏ ఇన్ ఛార్జీలకు వ్యతిరేకంగా వేరేవాళ్లను ప్రొత్సాహించడం లేదన్నారు. ఏమైనా ఉంటే చంద్రబాబుకే చెబుతానని పేర్కొన్నారు.  మాచర్ల బ్రహ్మానంద రెడ్డికి ఇస్తామంటున్నారు.. కచ్చితంగా గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. గురజాలలో ఎలా ఉంటుందో తెలియదన్నారు.

ఏదైనా కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం మంచిదని సూచించారు. కొత్తవాళ్లకు అని కాదు.. కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్లివ్వాలని కోరారు. కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా గెలుస్తారని.. తామంతా సపోర్ట్ చేస్తామని వెల్లడించారు. కన్నాతో రాజీ లేదు.. ఏం లేదు.. పార్టీ కోసం పని చేస్తామని తేల్చి చెప్పారు. కన్నా పదేళ్లు ఏడిపించాడు.. ఆ తర్వాత కోర్టులో రాజీ పడ్డారని పేర్కొన్నారు. కన్నా చంద్రబాబునూ ఏడిపించాడు.. కానీ కొన్ని కారణాల వల్ల పార్టీలో చేరారని తెలిపారు. ఏదేమైనా చంద్రబాబు మాటే తమకు వేదం అన్నారు.