Intermediate Exams : ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు.

Intermediate Exams : ఏపీలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

Ap Intermediate Exams

Intermediate Exams :  ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. వృత్తి విద్యా పరీక్షలకు 87,435 మంది విద్యార్ధులు హజరవుతున్నారు.

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాలు ఉన్న మార్గాల్లో రెగ్యులర్ బస్ సర్వీసులు ఏవీ రద్దుచేయకుండా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు.

Also Read : Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి