సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన ఫొటోలు…వివాహిత ఆత్మహత్యాయత్నం

  • Published By: bheemraj ,Published On : August 22, 2020 / 09:45 PM IST
సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన ఫొటోలు…వివాహిత ఆత్మహత్యాయత్నం

నిర్మల్‌ జిల్లాలో దారుణం జరిగింది. తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ముధోల్‌లో శనివారం చోటుచేసుకుంది.

పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. మనస్తాపం చెందిన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.