Gudivada Amarnath: వైసీపీకి ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు, చంద్రబాబు ఆశల కోసం పవన్ పనిచేస్తున్నారు: మంత్రి అమర్నాథ్

సోనియాను ఢీ కొట్టిన జగన్ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకుంటే జనం నవ్వకుంటారని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేనలపై మంత్రి అమర్నాథ్ విరుచుకు పడ్డారు

Gudivada Amarnath: వైసీపీకి ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు, చంద్రబాబు ఆశల కోసం పవన్ పనిచేస్తున్నారు: మంత్రి అమర్నాథ్

Amar

Gudivada Amarnath: దేశ రాజకీయాల్లోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రతిపాదనలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని, ఆంధ్రాలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని రాజకీయ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈక్రమంలో కాంగ్రెస్ తో పోత్తుపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో వైసీపీకి ఏ రాజకీయ పార్టీతో పోత్తు పెట్టుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నారని, బలమైన ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీలు పోత్తు పెట్టుకోవడం సహజమని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. సోనియాను ఢీ కొట్టిన జగన్ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకుంటే జనం నవ్వకుంటారని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్స్ లేకుండా చేసింది జగన్ మెహన్ రెడ్డేనని ఆయన అన్నారు.

Also Read:Prashant Kishor : ప్రగతి భవన్‌‌లో పీకే.. టెన్షన్‌‌లో టి. కాంగ్రెస్

సీట్లు కోసం ఎదురు చుసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే రాష్ట్రంలో ఒక్క సీటు రాదు కదా కనీసం డిపాజిట్లు కూడా రావని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలపై మంత్రి అమర్నాథ్ విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారి దత్త పుత్రుడని..చంద్రబాబు ఆశల కోసం..ఆశయాల కోసం పవన్ పని చేస్తున్నాడని మంత్రి అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ఎన్టీఆర్ చెప్పేవారని, అలాంటిది గత ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుందని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మనిషిలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి వారి రెండో భార్య రేణు దేశాయిని అడిగితే చెప్తారంటూ మంత్రి గుడివాడ అమరనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:M. Venkaiah Naidu : ఆర్ధిక సహాయం కోరిన ఉపరాష్ట్రపతి ?

జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కు అసలు జైలు కెళ్ళడం, శిక్షలు పడడంలో తేడా తెలుసా అని మంత్రి గుడివాడ ప్రశ్నించారు. జగన్ పై మోపిన కేసుల్లో ఏ ఒక్క కేసులోనూ ముద్దాయిగా నిరూపించబడలేదని..అది కాంగ్రెస్ చేసిన కుట్ర అని అందరికి తెలుసునని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఈ నిజాలు తెలుసు కాబట్టే 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీ సీట్లు ఇచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబు తన సొంత పుత్రుడు లోకేష్ పై నమ్మకం లేకనే, దత్తపుత్రుడు పవన్ ను నమ్ముకున్నారని మంత్రి విమర్శించారు. ఐదు సంవత్సరాలలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న రికార్డ్ పవన్ కళ్యాణ్ ది అంటూ మంత్రి అమర్నాథ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు బ్యానర్లో పవన్ దత్తపుత్రుడు సినిమా తీస్తున్నారని ఆ సినిమా ప్లాప్ అవ్వడం ఖాయం అంటూ అమర్నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని మంత్రి అన్నారు.

Also read:Madhapur Accident : మారని తాగుబోతులు.. మాదాపూర్‌‌లో మరో ఆక్సిడెంట్