Andhra Pradesh : వంగవీటి రాధాకు హాని జరిగితే టీడీపీ నేతలదే బాధ్యత

రాధా తమ పార్టీలో ఉన్నా లేకపోయినా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు...రాధా రిక్వెస్ట్ చేయకపోయినా భద్రత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని...

Andhra Pradesh : వంగవీటి రాధాకు హాని జరిగితే టీడీపీ నేతలదే బాధ్యత

Vangaveeti

Minister Vellampalli : బెజవాడ రాజకీయమంతా వంగవీటి రాధా చుట్టే తిరుగుతోంది. తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారన్న రాధా వ్యాఖ్యలతో అలజడి మొదలైంది. అయితే.. వంగవీటి రాధా ఇప్పటివరకు కూడా పోలీసులకు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయలేదు. తనను.. తన అభిమానులే రక్షిస్తారని చెబుతున్నారు. అయినప్పటికీ.. పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో..మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీ కాదా ? రాధాకు హాని జరిగితే టీడీపీ నేతలదే బాధ్యత అని స్పష్టం చేశారు.

Read More : Gorati Venkanna : తెలంగాణ కవి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

థాయిలాండ్ ఇతర ప్రాంతాల్లో కూర్చొని చంద్రబాబు లేఖలు రాయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్లు చంద్రబాబు డిజిపికి లేఖ రాశారని ఎద్దేవా చేశారు. రాధా రిక్వెస్ట్ చేయకపోయినా భద్రత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని, రాధా తమ పార్టీలో ఉన్నా లేకపోయినా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. బీజేపీ పార్టీపై పలు విమర్శలు గుప్పించారు మంత్రి వెల్లంపల్లి. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తాగుబోతుల సంఘం అధ్యక్షుడులా ఉన్నాడని, ఆయన మద్యంపై మాట్లాడాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు. బెయిలుపై వచ్చిన వాళ్ళు జైళ్లకు వెళ్తారని చెప్పడానికి ప్రకాశ్ జవదేకర్ ఎవ్వరని నిలదీశారు. సీబీఐ, కోర్టులు, స్వతంత్ర వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వ చేతుల్లో నడుస్తున్నాయా అని ప్రశించారు. ప్రస్తుతం బీజేపీ ఏపీలో ఉనికి కోసం పాకులాడుతోందని విమర్శించారు మంత్రి వెల్లంపల్లి.

Read More : Girl Rape : నాకే శిక్ష వేస్తావా అంటూ ..జడ్జి మీదకు చెప్పు విసిరిన రేపిస్టు..

టీడీపీ అధినేత చంద్రబాబు.. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రాధాకు ఫోన్ చేసి.. ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లను తిరస్కరించడం సరికాదన్నారు. పార్టీ అండగా ఉందని కుట్ర రాజకీయాలపై పోరాడదామని చెప్పారు. ఇక రాధా హత్యకు జరిగిన కుట్ర, రెక్కీపై సమగ్ర విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు చంద్రబాబు. దీనిపై.. ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు తెలిపారు డీజీపీ.