Nara Lokesh : మడమతిప్పిన వారిని నిలదీయొద్దా ? CPS రద్దు చేయాలి

ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు? అంటూ ప్రశ్నించారు. మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా ? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్భంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నట్లు...

Nara Lokesh : మడమతిప్పిన వారిని నిలదీయొద్దా ? CPS రద్దు చేయాలి

Nara Lokesh

AP CPS Issue : విజయవాడ దద్ధరిల్లింది. సీపీఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు కదం తొక్కారు. CPS రద్దుపై ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగా… 2022, 25వ తేదీ సోమవారం ఛలో CMOకి పిలుపునిచ్చింది. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఎక్కడికక్కడనే అడ్డుకుంటుండడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముందస్తుగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు విజయవాడకు రాకుండా ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

Read More : Police Special Surveillance : ఉపాధ్యాయుల చలో సీఎంఓ కార్యక్రమంపై పోలీసులు ప్రత్యేక నిఘా

ఈ క్రమంలో పోలీసుల తీరును ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు? అంటూ ప్రశ్నించారు. మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా ? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్భంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్భందించారని, వారం రోజుల్లో సీపీఎస్ రద్దని మాట తప్పి కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం CPS ను రద్దు చెయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Read More : సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ రివ్యూ

మరోవైపు.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీపీఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపడుతున్నారు. అయితే అక్కడికి వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూటీఎఫ్‌ ప్రకటించడంతో.. భారీగా పోలీసులను మోహరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో 10మందిని.. తెనాలిలో నలుగురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. CPS రద్దుపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని.. చర్చల పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు .. ఉపాధ్యాయులు. ఇప్పటికే పన్నెండుసార్లు ప్రభుత్వంతో చర్చించినా ఫలితం శూన్యమని.. మళ్లీ చర్చలు జరిపినా ఇదే రిపీట్‌ అవుతుందంటున్నారు. తమకు చర్చలు ముఖ్యంకాదని, స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్లు. లేదంటే, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.