Andha Pradesh Politics : మా పార్టీవారే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు..నాకు ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ

నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మర్చిపోకముందే మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నా ఫోన్, నా పీఏ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని.. నాకు ప్రాణహాని ఉంది అని కూడా వ్యాఖ్యానించారు ఆనం. ఇలా ఫోన్ ట్యాపింగ్ ల విషయంలో వైసీపీలు ఒక్కొక్కరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Andha Pradesh Politics : మా పార్టీవారే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు..నాకు ప్రాణహాని ఉంది :  వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ

Nellore YCP MLA Anam Rannarayana Reddy's sensational comments on the issue of phone tapping

Andha Pradesh Politics :  నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మర్చిపోకముందే ఫోన్ ట్యాపింగ్ పైమరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నా ఫోన్, నా పీఏ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని.. నాకు ప్రాణహాని ఉంది అని వ్యాఖ్యానించారు ఆనం. ఇలా ఫోన్ ట్యాపింగ్ ల విషయంలో వైసీపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ముసలం రాజుకున్నట్లుగా తెలుస్తోంది. నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. నా పీఏ ఫోన్ కూడా చేశారు. ఇది దాదాపు రెండేళ్లుగా జరుగుతోంది. నా పిల్లలతో నేను ఫోన్ మాట్లాడాలన్నా ఫేస్ యాప్ లో మాట్లాడుకోవాల్సి వస్తోంది ఇది మా పరిస్థితి. ఇది మాపార్టీవారే చేస్తున్నారు ఇక ఎవరికి ఫిర్యాదు చేయాలి? అంటూ ఆనం వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం ప్రస్తుతం వైసీపీ పార్టీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని..నెల్లూరు జిల్లాలో గ్యాంగ్ స్టర్ రాజకీయాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల ముప్పు ఉన్న నాకు సెక్యూరిటీని తగ్గించారంటూ వాపోయారు ఆనం. నెల్లూరు వైసీపీ నేతలు గ్యాంగ్ స్టర్లలా తయారయ్యారని రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను చంపేయాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh : సాక్ష్యాలు బయటపెడితే ‘గవర్నమెంట్ షేక్ అవుతుంది’..ఐపీఎస్‌ల ఉద్యోగాలు ఊడుతాయ్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వేధింపులు, సాధింపులు నాకు కొత్తకాదని..తనను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని.. తనతో పాటు తన పీఏ ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. నాకు ఎటువంటి నేర చరిత్రలు లేవు..నేనేమీ సీబీఐ కేసుల్లో నేను అంటూ సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం ఏలుతుందని..నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిని నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్ పెరుగుతున్నారంటూ నేను వ్యాఖ్యలు చేసిన రోజు నుండి తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆనం ఆరోపించారు. తన నియోజకవర్గంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలున్నాయని అన్న ఆయన నాకు సెక్యూరిటీ తగ్గించేశారని ఇది ఎంత వరకు సరైంది? అంటూ ప్రశ్నించారు.

Andhra Paradesh Politics : YCPలో కోటంరెడ్డి కుంపటి..2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు నేత

కాగా ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలన కలిగిస్తున్న క్రమంలో ఆనం వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఊతమిస్తున్నారు. నా ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోందని  దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని ఆ సాక్ష్యాలు బయటపెడితే ఏపీ గవర్నమెంట్ షేక్ అవుతుంది అంటూ ఆటంబాబు పేల్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ సాక్ష్యాలు బయటపెడితే ఐపీఎస్ ల ఉద్యోగాలు ఊడుతాయని వ్యాఖ్యానించిన కోటంరెడ్డి ఇక తాను వైసీపీలో కొనసాగలేనన్నారు. 2024 ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచే టీడీపీ నుంచి పోటీ చేస్తాను అంటూ తేల్చి చెప్పారు. ఇలా నెల్లూరు జిల్లాల్లో వైసీపీలో ముసలం రాజుకుంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేకా మరింతమంది నేతలు తమ నిరసన గళాలు విప్పుతారో వేచి చూడాలి.