AP PRC Issue : పీఆర్సీ అంశం తేలేనా…అసంపూర్తిగా చర్చలు

పీఆర్సీపై స్పష్టత రాలేదు. తాజాగా...ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రాష్ట్రప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్రస్థాయి మండిపడ్డారు...

AP PRC Issue : పీఆర్సీ అంశం తేలేనా…అసంపూర్తిగా చర్చలు

Ap Prc

AP PRC Issue : ఏపీలో పీఆర్సీ (PRC) లెక్కలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగ సంఘాలతో మరోసారి ఏపీ ప్రభుత్వం భేటీ అయ్యింది. 2021, డిసెంబర్ 30వ తేదీ గురువారం మధ్యాహ్నం సచివాలయంలో ఉద్యోగుల సమావేశం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్‌ సమీర్‌ శర్మ కూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత రాలేదు. తాజాగా…ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం అసంపూర్తిగా ముగిసింది. రాష్ట్రప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్రస్థాయి మండిపడ్డారు ఉద్యోగ సంఘాల నాయకులు. ప్రభుత్వ తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు.

Read More : COVID-19 : నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా..మహిళకు కోవిడ్ పాజిటివ్..

ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఉపయోగం లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్‌ ఎంత ఇస్తారంటే మళ్లీ మొదటికొచ్చారు…సీఎం వద్దకు వారం రోజుల్లో తీసుకెళ్తామని ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇవాళ చెబుతున్నారని రెండు నెలలుగా ఫిట్ మెంట్‌పై చర్చించి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గతంలోనే ఎక్కువ జీతం తీసుకున్నారని దానికి తగ్గకుండా ఇస్తామని చెబుతున్నట్లు, ఇది అన్యాయం అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Viral Video: కవాతుకు అడ్డొచ్చిన చిన్నారి కాలును తొక్కిన సైనికుడు

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, సీపీఎస్ ఉద్యోగులను ఏం చేస్తారో సీఎం క్లారిటీ ఇవ్వాలని అన్నారు ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ బండి బండి శ్రీనివాస్‌. లేకుంటే.. 3వ తారీఖున తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇక 14.29 శాత‌ం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వానికి సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. మధ్యంతర భృతి కన్నా తక్కువ పీఆర్సీ ఇస్తే జీతాలు తగ్గిపోతాయంటూ ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.