Bezawada : కరోనా కేకలు, ఉల్లిగడ్డల ఆటోలో కోవిడ్ పేషెంట్..

బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి. 

Bezawada : కరోనా కేకలు, ఉల్లిగడ్డల ఆటోలో కోవిడ్ పేషెంట్..

Bejawada

Corona Cases : బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.  విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ పై ఇద్దరు, ముగ్గురికి వైద్యం చేస్తున్నారు. నేలపై పడుకోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు.

బెడ్లు ఖాళీ లేక అంబులెన్స్‌ల్లో నగరం అంతా తిరుగుతున్నారు రోగులు. కరోనా కేసులు పెరగడంతో అంబులెన్సులు దొరకని పరిస్థితి. బెజవాడలో ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోయేసరికి ఉల్లిపాయలు ఆటోలోనే పేషంట్ ను ఆస్పత్రికి తరలించారు. బెడ్లు ఖాళీ లేవంటూ ఆసుపత్రి ఆవరణ బయటే ఆటో నిలిపివేశారు. ఇంతలోనే పేషంట్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన భర్త ప్రాణాలు కోల్పోయారంటూ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆక్సిజన్‌ పెట్టండి మహోప్రభు అన్న ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. బెడ్లు ఖాళీ లేవంటూ బలవంతంగా వైద్య సిబ్బంది బయటకు పంపారని.. ఇంతలోనే కన్నుమూశాడని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తోంది.

విజయవాడ ఆస్పత్రుల్లో ఎక్కడ చూసిన రోగుల రోధనలే. ఆస్పత్రి యాజమాన్యాలు మానవత్వాన్ని మరిచిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం పట్టించుకోవాలంటూ రోగుల బంధువులు వేడుకుంటున్నారు. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తాకిడి ఎక్కువైంది. దీంతో వైద్యం చేయలేక ఆస్పత్రి సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.

కరోనా రోగులతో ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, మందులు, ఇంజెక్షన్ల కొరత ఏర్పడుతుంటే.. పెరుగుతున్న మృతులతో శ్మశానాల్లో దహన సంస్కారాలు కూడా కష్టంగా మారుతోంది. ఇటు సహజ మరణాలు, అటు కోవిడ్‌ మృతులతో శ్మశానాలకు తాకిడి పెరుగుతోంది. గతంలో పది మృతదేహాలు వచ్చే శ్మశానాలకు ఇప్పుడు 70 నుంచి 100 వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఘాట్‌లు ఖాళీగా ఉన్నా.. దహనం చేసే కాటికాపరులు లేక మృతుల కుటుంబ సభ్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వస్తున్న శవాలతో పోలిస్తే కాటికాపరులు చాలా తక్కువగా ఉన్నారు. దీంతో మృతదేహాన్ని తీసుకొచ్చి గంటల తరబడి వేచిచూసే పరిస్థితి ఉంది.

Read More : Vizag : నిన్న హైదరాబాద్ నేడు విశాఖ, పైకి స్పా సెంటర్..లోపల వేరే సీన్లు