Chandrababu : కులాలు, మతాల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతోంది : చంద్రబాబు

వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల మధ్య రాష్ట్ర ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని టీడీపీ అధినేత విమర్శించారు.

Chandrababu : కులాలు, మతాల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతోంది : చంద్రబాబు

Chandrababu (1)

Chandrababu angry with YCP : వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల మధ్య రాష్ట్ర ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని విమర్శించారు. ఎప్పుడైనా దేవాలయాలపై దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. గురువారం(అక్టోబర్ 21,2021) మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు 36 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మంచిదైనా.. చెడ్డ వ్యక్తి దాన్ని అమలు చేస్తే చెడే జరుగుతోందన్నారు.

వైపీపీ పాలన విధానాన్ని ఎండగట్టారు. రోడ్లు వేయలేదు.. పన్నులు పెంచారు.. అప్పులు పాలయ్యామని పేర్కొన్నారు. ఏ పిల్లల కోసం పాటుపడుతున్నామో.. ఆ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Payyavula Keshav: అది తిట్టు కాదు.. ఇంకో అర్థం కూడా ఉందంటున్న టీడీపీ ఎమ్మెల్యే..!

ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరుగుతోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని తెలిపారు. పొరుగు రాష్ట్రం డీజీపీ ఏపీలో గంజాయి సాగు జరుగుతోందంటూ ప్రకటనలిచ్చారని చెప్పారు. తెలంగాణ సీఎం తన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేసేందుకు సమీక్ష పెట్టారని తెలిపారు.

నేతల భాషపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ చేశారు. గంజాయి స్మగ్లింగ్, సాగుపై ఉక్కుపాదం మోపండి.. తాము సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఏపీలో ఉందని విమర్శించారు. వైసీపీ, ప్రభుత్వంతో తెలుగుదేశానికి ఆస్తుల తగాదాలు లేవు.. దాయాదుల పోరు లేదన్నారు. ఇంత వరకు తన మంచితనం.. పార్టీ మంచితనం చూశారు.. ఎల్లకాలం ఇది సాగదని స్పష్టం చేశారు.