Telugu States : రక్తమోడిన రోడ్లు, భార్య కళ్లెదుటే భర్త మృతి, రెడిమిక్స్ వాహనం కింద యువకుడు నుజ్జునుజ్జు
రోడ్లు రక్తమోడాయి. టిప్పర్ ఢీకొనడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డుప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో రాత్రి రోడ్లు రక్తమోడాయి. రంగారెడ్డి జిల్లా రాందాస్పల్లిలో టిప్పర్ ఢీకొనడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. బైక్పై వెళుతున్న లక్ష్మయ్య దంపతులను టిప్పర్ రివర్స్ గేర్లో ఢీకొనడంతో…ఆ స్పీడ్కు బైక్ చాలా దూరంలో పడింది. 34 ఏళ్ల లక్ష్మయ్య ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య భార్య అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడింది. భర్త మృతితో గుండెలవిలసేలా రోదించిన ఆమెను ఓదార్చడం బంధువులు, స్థానికుల వల్ల కాలేదు.
Read More : Sourav Ganguly: క్రికెటర్లకు మరణ భయం పుట్టుకొచ్చింది – గంగూలీ
పెద్ద దిక్కును కోల్పోయిన తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆందోళనకు దిగింది. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఎస్.ఆర్. రాక్ క్రషర్ కంపెనీకి చెందినది కావడంతో..ఆ క్రషర్ కంపెనీ ఎదుట అంధకారంలోనే ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు డిమండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. ఎస్.ఆర్ రాక్ క్రషర్ కంపెనీ యాజమాన్యం సమాధానం ఇవ్వలేదు. పైగా విద్యుత్ మైన్ ఫీజును తీసుకుని వెళ్లిపోయారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
Read More : Viral Video : ఇంటర్వ్యూ గదిలో చెల్లిపై దాడి చేసిన అక్క..కారణం ఏమిటో తెలుసా ?
హైదరాబాద్…గచ్చిబౌలిలో జరిగిన రోడ్డుప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మసీదు బండ రోడ్డులో బైక్ను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మృతుడు 45 ఏళ్ల కృష్ణగా గుర్తించారు. రెడీమిక్స్ లారీ వెనుక చక్రాలు మీదకు ఎక్కడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు కృష్ణ. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Read More : Dr. Sameer Sharma : సీఎం జగన్ ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ సమీర్ శర్మ
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో లారీ, బైక్ ఢీకొన్నాయి. హిందూపురం రోడ్లోని కొల్లాపూరమ్మ గుడి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందారు. సుదర్శన్, బొజ్జమ్మ దంపతులు బైక్పై కంబదూరు మండలం పాళ్లూరు వెంకటంపల్లి గ్రామానికి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సుదర్శన్ దంపతులను కల్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది బొజ్జమ్మ. తరచూ జరుగుతున్న ప్రమాదాలతో…కళ్యాణదుర్గం పట్టణంలోకి హెవీ లారీలను అనుమతించవద్దంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.