Andhra Pradesh : సర్పంచులకు శుభవార్త.. జీవో నం.2 వెనక్కు తీసుకున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కు తీసుకుంది. ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 2ను వెనక్కు తీసుకుంది. ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జీవో వివరాల్లోకి వెళితే.. సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 2ను తీసుకొచ్చింది. అయితే దీనిపై సర్పంచులు, కార్యదర్శుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
చదవండి : Andhra Pradesh : ఏడుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా
ఈ జీవో వలన తమ పదవికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా అవుతుందని గ్రహించిన సర్పంచులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ జీవోపై ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. జీవో నంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది ఏపీ ప్రభుత్వం.
చదవండి : Andhra Pradesh PRC : పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష..త్వరలో ఉద్యోగ సంఘాలతో భేటీ