Passenger: బస్సులో తోటి ప్రయాణికులపై కారం చల్లిన ప్రయాణికుడు.. కారణమేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్, పాలకొల్లులో బస్సులో ఒక ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. గల్ఫ్ వెళ్లాలనుకున్న అతడి వీసా గడువు ముగిసిపోయింది. దీంతో ప్రయాణం నిలిచిపోయింది. ఈ కారణంతో అసహనానికి గురయ్యాడు.

Passenger: బస్సులో తోటి ప్రయాణికులపై కారం చల్లిన ప్రయాణికుడు.. కారణమేంటో తెలుసా?

Passenger: ఏపీ, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో ఒక ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. బస్సులో తోటి ప్రయాణికులపై కారం చల్లాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. అయోధ్య లంకకు చెందిన రాంబాబు అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు.

Jharkhand Shocker: భార్యపై అనుమానం.. కోపంతో నాలుగేళ్ల కూతురుకు నిప్పంటించిన తండ్రి

అయితే, అక్కడ వీసా గడువు ముగిసిందని అధికారులు వెనక్కి తిప్పి పంపారు. దీంతో అక్కడ్నుంచి బస్సులో పాలకొల్లు చేరుకున్న రాంబాబు హల్‌చల్ సృష్టించాడు. ఎయిర్‌పోర్టు అధికారులు తిప్పి పంపడంతో అసహనానికి గురైన రాంబాబు, ఇంద్ర ఏసీ బస్సులోని తన తోటి ప్రయాణికులపై కారం చల్లాడు. బ్యాగులో తన వెంట తెచ్చుకున్న కారాన్ని అందరిపై చల్లాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

వెంటనే అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులు అతడ్ని పట్టుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ తరలించారు. నిందితుడిని విచారిస్తున్నారు.