Thirumala : నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యానికి టీటీడీ చర్యలు చేపట్టింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.

Thirumala : నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Tirumala

Srivari Special entrance Darshan tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యానికి టీటీడీ చర్యలు చేపట్టింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు.

జనవరి నెలకు సంబంధించి రోజుకు 20 వేల చొప్పున ఆరు లక్షల 20 వేల టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. అలాగే రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించి రోజుకు 5 వేల చొప్పున మొత్తం లక్షా 55 వేల సర్వదర్శనం టికెట్లను ఇస్తామని వెల్లడించింది.

CJI Justice NV Ramana : సొంతూరుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. బాధ్యతలు చేపట్టాక తొలిసారి

సర్వదర్శనం ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతిలో డిసెంబర్‌ 31 నుంచి ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఆఫ్‌లైన్‌ టోకెన్లు కూడా రోజుకు 5 వేల చొప్పున జారీ చేస్తారు. తిరుమల వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక నిన్ననే వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.