Thirumala : నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యానికి టీటీడీ చర్యలు చేపట్టింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.
Srivari Special entrance Darshan tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యానికి టీటీడీ చర్యలు చేపట్టింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు.
జనవరి నెలకు సంబంధించి రోజుకు 20 వేల చొప్పున ఆరు లక్షల 20 వేల టికెట్లను విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. అలాగే రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించి రోజుకు 5 వేల చొప్పున మొత్తం లక్షా 55 వేల సర్వదర్శనం టికెట్లను ఇస్తామని వెల్లడించింది.
CJI Justice NV Ramana : సొంతూరుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. బాధ్యతలు చేపట్టాక తొలిసారి
సర్వదర్శనం ఆఫ్లైన్ టికెట్లను తిరుపతిలో డిసెంబర్ 31 నుంచి ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఆఫ్లైన్ టోకెన్లు కూడా రోజుకు 5 వేల చొప్పున జారీ చేస్తారు. తిరుమల వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్లో భక్తులు పొందవచ్చు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్లైన్లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక నిన్ననే వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.