Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు.. ఘాట్ రోడ్ల విషయంలో టీటీడీ ఏం చేయాల్సి ఉంది!

తిరుమలకు ప్రతిరోజు వేలాది వాహనాలు వచ్చిపోతుంటాయి. కార్లు, ప్రైవేటు బస్సులు, టెంపోలు, జీపులు ఇలా పదివేల వరకు వాహనాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి.

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు.. ఘాట్ రోడ్ల విషయంలో టీటీడీ ఏం చేయాల్సి ఉంది!

Tirumala Ghat Road

Tirumala Ghat Road Accidents : తిరుమల ఘాట్‌రోడ్లపై గతంలో ఎప్పుడూ లేనట్లుగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లో జరిగిన వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ (TTD) అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. రెండు ఘాట్ రోడ్లలో కలిపి ఐదారు ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్లలో చిన్నపాటి ప్రమాదాలు జరగడం కామన్. కానీ పదుల సంఖ్యలో భక్తులతో వెళ్తున్న బస్సు, టెంపో లాంటి వాహనాలు పల్టీలు కొట్టడం మరింత టెన్షన్ కలిగిస్తోంది. అయితే ప్రమాదాలకు వాహనదారులు కారణమా.. ఘాట్ రోడ్లలోనే మార్పులు చేయాల్సి ఉందా అన్న చర్చ జరుగుతోంది.

ప్రమాదాలకు కారణం వాహనదారులేనా
తిరుమల ఘాట్‌లో ప్రమాదాలకు స్పీడ్ లిమిట్ నిబంధనలను ఎత్తివేయడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. గతంలో అలిపిరి నుంచి తిరుమలకు ప్రయాణ సమయం 28 నిమిషాలుగా ఉండేది. తిరుమల నుంచి అలిపిరికి వచ్చే సమయం 40 నిమిషాలు ఉండాలన్న నిబంధనలు అమలు చేశారు. అంతకంటే వేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తే చర్యలు తీసుకునేవారు. ఓవర్ స్పీడ్, నిబంధనలు ఉల్లంఘించారని ఫైన్లు వేసేవారు. కొద్ది నెలల క్రితం ఈ స్పీడ్ లిమిట్ (Speed Limit) నిబంధనలను సడలించారు. అప్పటి నుంచి డ్రైవర్లు వాహనాలను ఓవర్ స్పీడ్ (Over Speed) తో నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. కొందరు డ్రైవర్లు ఓవర్‌టేక్‌ (Overtake)లు చేస్తూ.. అడ్డగోలుగా హారన్స్ Horons కొడుతూ ఇతర వాహనాలను ఇబ్బంది పెడుతున్నట్టు తేల్చారు. ఈ సమయంలో అయోమయానికి గురై స్పీడ్ ను కంట్రోల్ చేయలేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు టీటీడీ అధికారులు.

తిరుమలకు ప్రతిరోజు వేలాది వాహనాలు వచ్చిపోతుంటాయి. కార్లు, ప్రైవేటు బస్సులు, టెంపోలు, జీపులు ఇలా పదివేల వరకు వాహనాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. ప్రతిరోజు 9 నుంచి 10 వేల కార్లు రెండవ ఘాట్ రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. మరో 3వందల వరకు ఆర్టీసీ బస్సులు తిరుమల.. తిరుపతి మధ్య ప్రతిరోజు భక్తులను తరలిస్తాయి. ఇక టూవీలర్ల రాకపోకలు అయితే వేల సంఖ్యలోనే ఉంటాయి. కరోనా తరువాత తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో పాటు వాహనాల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరిగింది. ప్రతిరోజు తిరుమలలో 20 వేల వాహనాలు ఉంటాయంటే ఆశ్చర్య పోనవసరం లేదు.

రోజురోజుకు తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. భక్తులతో పాటు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. మొదటి ఘాట్ రోడ్ లో మే 28న ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బస్సు పల్టీలు కొట్టకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే విధంగా మొదటి ఘాట్ రోడ్డులో 6వ మలుపు దగ్గర కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ వాహనం అది తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్లో కూడా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. మొదటి ఘాట్ రోడ్ లో మరో వాహనం ప్రమాదానికి గురైంది.

Also Read: భీమవరంలో హైటెన్షన్.. వైసీపీ-జనసేన ఫ్లెక్సీ వార్‭పై ఆందోళనకు పిలుపు, ముందస్తు అరెస్టులు

సోమవారం ఒక్కరోజే తిరుమల రెండు ఘాట్ రోడ్లలో నాలుగు ప్రమాదాలు జరిగాయి. వాటిలో మూడు వాహనాలు కర్ణాటకకు చెందినవి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఈనెల 14న రెండు ప్రమాదాలు జరిగాయి. సోమవారం నాలుగు ప్రమాదాలు జరిగాయి. పలువురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి కూడా ఘాట్‌లో ఒక ప్రమాదం జరిగింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read: ఏందయ్యా కేశినేని నానీ.. నీ బిల్డప్, వెధవ సోది ఆపు : వైసీపీ నేత PVP సెటైర్లు

తిరుమల కొండపైకి వెళ్లడానికి, కిందకు రావడానికి రెండు వేర్వేరు ఘాట్ రోడ్లు ఉన్నాయి. మొదట ఒకే ఘాట్ రోడ్ మీదుగా తిరుమలకు రాకపోకలు సాగేవి. ప్రమాదాలు, భక్తుల రద్దీతో ట్రాఫిక్ జామ్‌ను దృష్టిలో పెట్టుకుని.. రెండోఘాట్ రోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. పాత ఘాట్‌రోడ్ 1944లో వేస్తే.. మరో ఘాట్ రోడ్‌ను 1947లో నిర్మించారు. పాత ఘాట్ రోడ్డును తిరుమల నుంచి తిరుపతికి వచ్చేలా.. కొత్త ఘాట్ రోడ్డ్ ను తిరుపతి నుంచి తిరుమల కొండకు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకునే 1944లోనే ఉన్నతస్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఘాట్ రోడ్ ను నిర్మించారు. ఎన్నో మూలమలుపులు, బ్లాక్ స్పాట్స్ ఉన్న తిరుమల ఘాట్ రోడ్లలో గతంలో ఎప్పుడూ ఇంతల ప్రమాదాలు జరగలేదు. వాహనాలు ఢీకొని చిన్నచిన్న ఘటనలే తప్ప.. చెప్పుకోదగ్గర ప్రమాదాలేం జరగలేదు. కానీ ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలు భక్తలను, టీటీడీ అధికారులను ఆందోళన కలిగిస్తున్నాయి.

యాక్సిడెంట్లకు చెక్ పెట్టేందుకు అధికారుల యాక్షన్ ప్లాన్.. వివరాలకు ఈ వీడియో చూడండి