Nayanthara Vignesh Shivan Slippers : నయనతార దంపతులపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటన

సినీ నటి నయనతార దంపతులపై టీటీడీ సీరియస్ అయ్యింది. నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చన్న దానిపై చర్చిస్తోంది.

Nayanthara Vignesh Shivan Slippers : నయనతార దంపతులపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటన

Nayanthara Vignesh Shivan Slippers

Nayanthara Vignesh Shivan Slippers : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో ప్రముఖ సినీ నటి నయనతార దంపతులు చెప్పులు ధరించి మాఢవీధుల్లోకి రావడం, ఫొటోషూట్ నిర్వహించడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. నయనతార దంపతులు చెప్పులతో మాఢ వీధుల్లో తిరగడం దురదృష్టకరం అని టీటీడీ వాపోయింది. నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చన్న దానిపై టీటీడీ చర్చిస్తోంది.

నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల పెళ్లి నిన్న అట్టహాసంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ ఖరీదైన రిసార్ట్ లో వీరి వివాహం వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి విచ్చేశారు. వివాహానంతరం ఈరోజు(జూన్ 10) నయనతార దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చారు.

Mischief In Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం వద్ద చెప్పులు వేసుకుని తిరిగిన నయనతార దంపతులు

ఈ సందర్భంగా నయనతార వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. నయనతార చెప్పులు ధరించడం వివాదాస్పదమైంది. నికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తిరుమల పవిత్ర ప్రదేశం. అక్కడి నాలుగు మాడవీధులను పరమ పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ఉత్సవమూర్తులు మాత్రమే మాఢవీధుల్లో తిరుగుతాయి. స్వామి వారి వాహన సేవలు మాత్రమే నిర్వహిస్తారు. అందుకే మాఢవీధుల్లో చెప్పులతో తిరగడాన్ని నిషేధించారు. ఎన్నోఏళ్లుగా ఇది పాటిస్తున్నారు. మాఢవీధుల్లో ఎవరూ కూడా చెప్పులతో తిరగకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అలాంటి పవిత్రమైన ప్రదేశంలో అపచారం జరిగిపోయిందని భక్తులు వాపోతున్నారు. విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. చెప్పులు వేసుకున్నా, ఫొటో షూట్ పేరిట ఆలయం ముందు అంత తతంగం జరుగుతున్నా విజిలెన్స్ పట్టించుకోలేదని మండిపడుతున్నారు. నయనతార జంటతో పాటు ఫొటొగ్రాఫర్లు కూడా చెప్పులు, బూట్లు వేసుకుని తిరిగారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో టీటీడీ స్పందించింది. దీన్ని సీరియస్ గా తీసుకుంది. నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేయనుంది.