TTD : 24 మందితో టీటీడీ కొత్త పాలక మండలి.. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం

తెలంగాణ నుంచి పినాక శరత్ చంద్రారెడ్డి, గడ్డం సీతా రెడ్డి(ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి సతీమణి)కి చోటు దక్కింది. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్ కు అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండేకు మండలిలో చోటు లభించింది.

TTD : 24 మందితో టీటీడీ కొత్త పాలక మండలి.. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం

TTD

TTD New Governing Body : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పాటు అయింది. టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల జాబితా విడుదల అయింది. 24 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరికి టీటీడీ పాలక మండలిలో అవకాశం లభించింది. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్ కుమార్, ఎమ్మెల్యే ఉదయభాను సామినేని, ఎమ్మెల్యే తిప్పేస్వామి, సిద్ధవటం యానాదయ్య, చందే అశ్వర్థ నాయక్, మేక శేషుబాబు, ఆర్ వెంకట సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి గారి సీతారామా రెడ్డి, గాదిరాజు వెంకట సుబ్బరాజు, పినాక శరత్ చంద్రారెడ్డి, రామ్ రెడ్డి సాముల, బాలసుబ్రమణియన్ పళనిసామి, ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి, గడ్డం సీతా రెడ్డి, కృష్ణమూర్తి వైద్యనాథన్, సిద్ధా వీర వెంకట సుధీర్ కుమార్, సుదర్శన్ వేణు, నెరుసు నాగసత్యం, ఆర్ వీ దేశ్ పాండే, అమోల్ కాలే, డాక్టర్ ఎస్ శంకర్, మిలింద్ కేశవ్ నర్వేకర్, డాక్టర్ కేతన్ దేశాయి, బోరా సౌరభ్ కు స్థానం లభించింది.

Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..

ఎమ్మెల్యే కోటాలో పోన్నాడ వెంకట సతీశ్ కుమార్, సామినేని ఉదయభాను, తిప్పేస్వామికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి పినాక శరత్ చంద్రారెడ్డి, గడ్డం సీతా రెడ్డి(ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి సతీమణి)కి చోటు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మేక శేషుబాబు, గడిరాజు వెంకట సుబ్బారాజు (ఉంగుటూరు),  నెరుసు నాగసత్యం (ఏలూరు), సిద్ధవటం యానాదయ్య(కడప), కర్నూలు నుంచి సీతారామారెడ్డి, సిద్ధా రాఘరావు కుమారుడు సిద్ధా వీర వెంకట సుధీర్ కుమార్ (ప్రకాశం జిల్లా), అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ కుస్థానం దక్కింది. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్ కు అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండేకు పాలక మండలిలో చోటు లభించింది.