KishanReddy meets Sai Tej:నటుడు సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.

KishanReddy meets Sai Tej:నటుడు సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి

Saitej

KishanReddy meets Sai Tej: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. శనివారం హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని సాయి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..సాయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రికి సాయి కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. సాయికు కిష్ణ రెడ్డి బొకే అందించగా, ఇరువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Also read: Tourist in Kerala: టూరిస్ట్ మద్యాన్ని పారబోసిన పోలీసులు, రంగంలోకి సీఎం ఆఫీస్

ఈసందర్భంగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తనను కలిసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతఙతలు తెలిపాడు. “బిజీ షెడ్యూల్ లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించిన కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు”.. “మీకు ఈ ఏడాది ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటున్న” అంటూ సాయి తేజ్ రాసుకొచ్చాడు. కాగా ఉన్నట్టుండి కేంద్ర మంత్రి.. ఈ యువ సినీ నటుడిని కలుసుకోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ద్విచక్ర వాహనం పై నుంచి జారిపడి సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Also Read: Viral Video: పెళ్లి పీటలపై నుంచి నేరుగా పానీపూరి తినేందుకు వెళ్లిన పెళ్లి కూతురు