Vizianagaram : పెళ్లి పేరుతో సహోద్యోగిని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి

ప్రేమించి, ఆమెను లైంగికంగా వాడుకొని, ఆపై పెళ్లి విషయానికి వచ్చేసరికి మొహం చాటేసిన ఓ మోసగాడు, చివరికి కటకటాల్లోకి వెళ్ళాడు.

Vizianagaram : పెళ్లి పేరుతో సహోద్యోగిని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి

Love Cheating

Vizianagaram :  ప్రేమించి, ఆమెను లైంగికంగా వాడుకొని, ఆపై పెళ్లి విషయానికి వచ్చేసరికి మొహం చాటేసిన ఓ మోసగాడు, చివరికి కటకటాల్లోకి వెళ్ళాడు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ముషిడిపల్లి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రెడ్డి నవీన్, అదే కార్యాలయంలో పనిచేస్తున్న సహచర మహిళా ఉద్యోగిని ప్రేమించాడు.

కొన్ని నెలలుగా  వీరి ప్రేమ కొనసాగింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలకడం తో ఆమె శారీరకంగా కూడా దగ్గరయింది. ఇందుకు అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు.  అయితే, తాను ఇల్లు కడతానని, దానికి అవసరమైన డబ్బు సాయం చేయాలని నవీన్, అమ్మాయి పై ఒత్తిడి చేసాడు. కట్నం విషయం కూడా ప్రస్తావించాడు. ఈ పరిస్థితుల్లో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
Also Read : Fastag : పారిపోయిన ఖైదీని పట్టిచ్చిన ఫాస్టాగ్
అయితే నవీన్ అంతటితో ఆగకుండా, తామిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలని అమ్మాయి పేరెంట్స్ కి పంపిస్తూ బెదిరింపులకు దిగాడు. తాను డిమాండ్ చేసిన కట్నం ఇవ్వకపోతే,  ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో అమ్మాయి, ఆమె తల్లి దండ్రులు ఎస్.కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.