Nellore : యువతిని తుపాకీతో కాల్చి చంపిన ప్రేమోన్మాది

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకునేందుకు యువతిని ఇవ్వలేదనే కోపంతో ఒకసాఫ్ట్ వేర్ ఇంజనీర్ యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Nellore : యువతిని తుపాకీతో కాల్చి చంపిన ప్రేమోన్మాది

Nellore

Nellore : నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకునేందుకు యువతిని ఇవ్వలేదనే కోపంతో ఒకసాఫ్ట్ వేర్ ఇంజనీర్ యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగుళూరులో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కావ్య అనే అమ్మాయి కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ముంబైలో ఉద్యోగం చేస్తోంది. కావ్యను ఇష్టపడ్డ సురేష్ రెడ్డి ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన పంపించాడు. ఒకే సామాజిక వర్గం, చదువు హోదాలో సరిపోతానని అనుకున్నాడు. కావ్యని సురేష్ రెడ్డికి ఇచ్చి పెళ్ళి చేయటానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

బంధువులు ద్వారా ఎన్నిసార్లు అడిగించినా కావ్య కుటుంబ సభ్యులు సురేష్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయటానికి అంగీకరించకపోవటంతో, ఆమెపై కోపం పెంచుకున్న సురేష్ రెడ్డి నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను ఏదో ఒకటి చేస్తానని బెదిరించసాగాడు. గత కొన్నాళ్లుగా ఇద్దరూ ఇంటి వద్దనుంచే పని చేస్తున్నారు. ఈక్రమంలో ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కావ్య ఇంటికి వెళ్లిన సురేష్ రెడ్డి ఆమెను కాల్చి చంపాడు.

అనంతరం సమీపంలోనే ఉన్న భవనం వద్దకు వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు శబ్దం విన్న చుట్టు పక్కల వారు కావ్యను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలో కావ్య మృతి చెందింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇరువురి మృతదేహాలు పోస్టు మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మరణించటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : YCP sajjala : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బంధం కొనసాగుతూనే ఉంటుంది-సజ్జల