Petrol Rate : పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పుపెట్టారు
పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పంటించాడో యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం పామూరు బస్సుస్టాప్ సెంటర్లో చోటుచేసుకుంది.
Petrol Rate : పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పంటించాడో యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం పామూరు బస్సుస్టాప్ సెంటర్లో చోటుచేసుకుంది. ఎండుకొండలు అనే యువకుడు కనిగిరి నుంచి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో ప్రయాణికులు హడలిపోయి వెంటనే బస్సులోంచి కిందకు దిగారు.
చదవండి : పండుగ రోజు షాక్.. పెరిగిన ఫ్యూయల్ ధరలు
స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకొని ఏడుకొండలుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా పొంతనలేని సమాధానం చెబుతూ పోలీసులను విసిగించాడు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతోనే తానూ ఈ పని చేశానని చెప్పాడు. ఏడుకొండలు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
చదవండి : థియేటర్లలో మొదలైన బ్యాచిలర్ పెళ్లి సందడి!