ఉబర్ కొత్త రూల్ : క్యాబ్ ఎక్కాలంటే మాస్కుతో సెల్ఫీ తీసి పంపాలి

  • Published By: nagamani ,Published On : October 20, 2020 / 03:43 PM IST
ఉబర్ కొత్త రూల్ : క్యాబ్ ఎక్కాలంటే మాస్కుతో సెల్ఫీ తీసి పంపాలి

uber india

Uber ‘Mask Verification Feature’ : ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబర్‌ భారత్‌లో కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. ‘మాస్క్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌’ అనే ఈ విధానం నేటి నుంచి అంటే అక్టోబర్ 19నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుచనున్నట్టు సంస్థ వెల్లడించింది. దీంతో గతంలో మాస్క్‌ ధరించకుండా ఉబెర్‌లో ప్రయాణించిన వారికి యాప్‌ ఆ విషయాన్ని గుర్తుచేస్తుంది.




తదుపరి వారు ఉబర్‌ రైడ్‌ను బుక్‌ చేసుకోవాలంటే.. ‘‘మాస్క్‌ పెట్టుకుని సెల్ఫీ తీసుకుని ఆ ఫోటో‘‘ను పంపించాల్సి ఉంటుందని ఉమెర్ సంస్థ పేర్కొంది. వినియోగదారుడు మాస్క్‌ ధరించనపుడు.. ఆ విషయాన్ని డ్రైవర్‌ తన యాప్‌లో నమోదు చేస్తాడు. అప్పుడే అది పనిచేస్తుందని తెలిపారు.



https://10tv.in/googles-new-hum-to-search-feature-can-figure-out-the-song-thats-stuck-in-your-head/
ఈ ‘మాస్క్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌’ కొత్త రూల్ పై ఉబెర్‌ ఇండియా సీనియర్‌ డైరక్టర్‌ సచిన్‌ కన్సాల్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల నెలల తరబడి మూతపడ్డ వాహన సేవలు.. దేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయనీ..మా సంస్థ తరపున పనిచేసే డ్రైవర్ తో పాటు మా సేవలను వినియోగించుకునే ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాం. ఈ కరోనా కాలంలో డ్రైవర్..ప్రయాణీకుల భద్రతతో పాటు వారి ఆరోగ్య భద్రత కూడా మాకు ముఖ్యమేనని అందుకే ఈ ‘మాస్క్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌’ ప్రవేశపెట్టామని తెలిపారు.


చాలామంది ప్రయాణీకులు మాస్కులు ధరించకుండా ప్రయాణీస్తున్నార. ఇది వారితో పాటు డ్రైవర్ ఆరోగ్యమే కాదు మా వినియోగదారులకు కూడా ప్రమాదమే..ఈ నేపథ్యంలో వారికి భద్రతా నిబంధనలను గుర్తు చేయటం మా బాధ్యతగా భావించి ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. ఈ విధానం అమెరికా, కెనడాల్లో సెప్టెంబర్‌ నుంచే అమలుచేస్తున్నామని.. డ్రైవర్, వినియోగదారుడు ఇద్దరూ బాధ్యతాయుతంగా ఉంటేనే కరోనా వ్యాప్తిని నివారించగలం.




అంతేకాకుండా డ్రైవర్‌, ప్రయాణికుడు ఇద్దరిలో ఎవరు మాస్క్‌ ధరించకపోయినా, రెండవ వారు ఏ జరిమానా లేకుండానే ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపారు. మా సంస్థ తరపున పనిచేసే డ్రైవర్లకు 30 లక్షల మాస్కులు, రెండు లక్షల శానిటైజింగ్‌ బాటిల్స్‌ ఉచితంగా అందజేస్తున్నామని సచిన్ కన్సాల్ తెలిపారు.


కాగా..ఈ కరోనా వైరస్ ఈ ప్రపంచానికి ఎన్నో విషాదాలను మిగిల్చింది. మరోపక్క కొత్త పాఠాలు, మరెన్నో గుణపాఠాలు నేర్పింది. ఎన్నో జాగ్రత్తలు కూడా నేర్పింది. గతంలోలాగా దేన్ని పడితే దానిని చేతితో తాకొద్దు..చేతితో తాకాల్సిన వస్తువులను కాలితో తాకేలా చేసింది. ముఖాలకు మాస్కులు, చేతులకు శానిటైజర్లు, ఆహారంలో ప్రొటీన్, విటమిన్ల సమతుల్యతను చూసుకోవడం వంటివి ప్రజలు అలవాటు చేసింది. బయట ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మహమ్మారి సోకుతుందనే భయాన్నిచ్చింది. ప్రజలు కరోనా విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఉబర్ ఈ మాస్కుతో సెల్ఫీ అనే కొత్త రూల్ ను అమలుచేస్తోంది.