PM Modis US Tour : మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్కే అధిక ప్రయోజనం…సీఎం భూపేంద్ర పటేల్ వ్యాఖ్యలు
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనపై గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్ రాష్ట్రానికే అధిక ప్రయోజనం చేకూర్చిందని సీఎం పటేల్ వ్యాఖ్యానించారు...
![PM Modis US Tour : మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్కే అధిక ప్రయోజనం…సీఎం భూపేంద్ర పటేల్ వ్యాఖ్యలు PM Modis US Tour : మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్కే అధిక ప్రయోజనం…సీఎం భూపేంద్ర పటేల్ వ్యాఖ్యలు](https://10tv.in/wp-content/uploads/2023/07/PM-Modis-US-Tour.gif)
US Tour Has Benefited Gujarat Most
PM Modis US Tour : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనపై గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎం మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్ రాష్ట్రానికే అధిక ప్రయోజనం చేకూర్చిందని సీఎం పటేల్ వ్యాఖ్యానించారు. (US Tour Has Benefited Gujarat Most) గుజరాత్ (Gujarat) అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం కొనియాడారు.
Rajya Sabha seat : బెంగాల్ రాజ్యసభ బీజేపీ సీటు రేసులో సౌరవ్ గంగూలీ, మిథున్
సెమీకండక్టర్ల తయారీ కోసం గుజరాత్ ప్రభుత్వం, అమెరికన్ కంపెనీ మైక్రోన్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందున, ప్రధానమంత్రి అమెరికా పర్యటన గుజరాత్కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చిందని సీఎం పటేల్(Chief Minister Bhupendra Patel) పేర్కొన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు వల్ల గుజరాత్ రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనం కలుగుతుందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి.