Money Laundering Case: బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్కు సమన్లు పంపిన ఢిల్లీ కోర్టు
నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఆమెకు తెలుసని ఈడీ విశ్వసిస్తోంది. అతడితో జాక్వలిన్ టచ్లో ఉందని, తరుచూ వీరు వీడియో కాల్స్ మాట్లాడుతుంటారని ఈడీ పేర్కొంది. సుకేష్ నుంచి జాక్వలిన్ విలువైన గిఫ్ట్లు అందుకున్నట్లు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగ్లు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్లెట్, మినీ కూపర్, ఇలా దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులను జాక్వలిన్, ఆమె ఫ్యామిలీకి సుకేష్ ఇచ్చిన ఈడీ గుర్తించింది
Money Laundering Case: బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటొన్న ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. సెప్టెంబర్ 26న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా సమన్లలో ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.215 కోట్ల దోపిడీ కేసులో జాక్వలిన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఆమె పేరును చేర్చింది. సుకేష్ దోపిడీ చేసిన డబ్బు నుంచి జాక్వలిన్ లబ్ది పొందినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సుకేష్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వలిన్కు ముందే తెలిసినా అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించిందని ఈడీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఆమెకు తెలుసని ఈడీ విశ్వసిస్తోంది. అతడితో జాక్వలిన్ టచ్లో ఉందని, తరుచూ వీరు వీడియో కాల్స్ మాట్లాడుతుంటారని ఈడీ పేర్కొంది. సుకేష్ నుంచి జాక్వలిన్ విలువైన గిఫ్ట్లు అందుకున్నట్లు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగ్లు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్లెట్, మినీ కూపర్, ఇలా దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులను జాక్వలిన్, ఆమె ఫ్యామిలీకి సుకేష్ ఇచ్చిన ఈడీ గుర్తించింది. సుకేష్తో జాక్వలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు జాక్వెలిన్కు సమన్లు జారీ చేసింది.
Mahesh Babu: కొడుకు పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేష్!