Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో 10 మంది అరెస్ట్‌

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్‌కు పాల్పడ్డ పది మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో 10 మంది అరెస్ట్‌

Telugu

Telugu Academy funds scam case : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్కామ్‌కు పాల్పడ్డ.. ముఠాలోని పది మందిని అరెస్ట్‌ చేశారు. కేసులో పది మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు పోలీసులు. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీతో కుమ్మక్కై.. తెలుగు అకాడమీ డిపాజిట్లను కాజేశారు నిందితులు. ఈ ఏడాది జనవరి నుంచి స్కామ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కమీషన్‌ ఎర చూపించి.. బ్యాంక్‌, అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపారు నిందితులు. ఈ కేసులో ఇప్పటివరకు పది మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. కాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. గతంలోనూ ఈ ముఠా పలు స్కామ్‌లకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇక కేసు విచారణలో భాగంగా.. ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి.. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌, కేసులో ఏ1 నిందితుడు మస్తాన్‌ వలీని కస్టడీలోకి తీసుకోనున్నారు. మస్తాన్‌వలీని ఏడు రోజుల కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో.. అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంపై మస్తాన్‌ను ప్రశ్నించనున్నారు పోలీసులు. అకాడమీకి చెందిన మూడు అకౌంట్లలోంచి మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి.. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీయనున్నారు పోలీసులు.

Telugu Academy : తెలుగు అకాడమీలో గోల్ మాల్.. కలర్ జిరాక్స్‌లతో రూ. 64 కోట్లు మాయం

మరోవైపు.. తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వాస్తవమేనని.. త్రిసభ్య కమిటీ తేల్చింది. నిధుల గల్లంతుపై.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అకాడమీలో అందరినీ విచారించిన కమిటీ సభ్యులు.. ఫైనల్‌ రిపోర్టును రూపొందించారు. డబ్బులు ఎలా బయటికి వెళ్లాయి..? నిధుల గోల్‌మాల్‌లో ఎవరెవరు ఉన్నారు..? వారి పేర్లతో సహా రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తం 65 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించిన త్రిసభ్య కమిటీ.. ఇక మీదట రెగ్యులర్ అకౌంట్స్ ఆఫీసర్‌తో పాటు రెగ్యులర్ డైరెక్టర్ ఉండాలని నివేదిక ఇచ్చింది.

గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ, మొన్నటివరకు డైరెక్టర్‌గా ఉన్న సోమిరెడ్డి నిర్లక్ష్యం కారణంగా అవకతవకలు జరిగాయని.. వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అకాడమీకి ఉన్న మూడు అకౌంట్ల నుంచి నిధులు దారి మళ్లాయని.. మరో 31 అకౌంట్లలో నిధులు సేఫ్‌గానే ఉన్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది. దీనిపై.. 22 పేజీల నివేదికను సమర్పించింది. త్రిసభ్య కమిటీ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్….ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

తెలుగు అకాడమీకి అన్ని బ్యాంకుల్లో కలిసి.. 340 కోట్ల నిధులున్నాయి. వాటిలో.. 64 కోట్ల రూపాయల డిపాజిట్లు దారి మళ్లాయి. కార్వాన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి 43 కోట్లు.. సంతోష్‌నగర్‌ నుంచి 12 కోట్లు. చందానగర్‌ అకౌంట్‌ నుంచి 10 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయి. డిపాజిట్లను ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి నగదును తీసుకున్నారు కేటుగాళ్లు. తెలుగు అకాడమీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు.. అటు ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన త్రిసభ్య కమిటీ సభ్యులు మొత్తం వ్యవహారంపై కూపీ లాగారు.