Ganja Seized : 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.

Ganja Seized : 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

Sdnr Ganja Seized

Ganja Seized : ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో కొత్తూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గాలింపు చేపట్టి…జాతీయ రహదారిపై  వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

ఈ సమయంలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన 214 కిలోల గంజాయి‌తో పాటు 3 కార్లను సీజ్ చేశామని చెప్పారు.
Also Read : East Godavari : భార్యతో కలహాలు-పిల్లలతో కలిసి బంగార్రాజు ఆత్మహత్యాయత్నం
ఏపి ఒరిస్సా సరిహద్దుల  నుండి మహారాష్ట్ర కు తరలిస్తుండగా ఈ గంజాయి పట్టుబడిందని తెలిపారు. పట్టుబడిన  గంజాయి విలువ  సుమారు రూ.70 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి ని తరలిస్తున్న 5గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదుని కూడా స్వాధీనం   చేసుకున్నామని వెల్లడించారు.