Gang Rape : బాలికపై 29మంది గ్యాంగ్ రేప్

మహారాష్ట్రలోని థాణె జిల్లాలో జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Gang Rape : బాలికపై 29మంది గ్యాంగ్ రేప్

Minor2

Gang Rape On Minor Girl మహారాష్ట్రలోని థాణె జిల్లాలో జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. థాణె జిల్లాలోని దోంబివల్లిలోని భోపర్​ ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో పలుసార్లు మైనర్ బాలికపై 29మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.

అసలేం జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోంబివల్లిలోని భోపర్​ ప్రాంతంలో నివాసముండే 15 ఏళ్ల బాలికకు ఓ యువకుడితో పరిచయం ఉంది. ఈ ఏడాది జనవరిలో ఓ సందర్భంలో ఆ యువకుడు.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరియు ఆ ఘటనను వీడియోలు తీశాడు. అనంతరం బ్లాక్​మెయిల్​కు పాల్పడ్డాడు. ఈ వీడియోలును ఆ యువకుడు తన మిత్రులు కొంతమందికి పంపిచాడు. ఈ వీడియోలను అడ్డుపెట్టుకుని అప్పటి నుంచి 29 మంది… దోబివల్లి, బద్లాపుర్​, ముర్బాద్​, రాబెల్​ సహా మరికొన్ని ప్రాంతాల్లో చిత్రహింసలు పెట్టి తొమ్మిది నెలల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దత్తాత్రే కరాలే తెలిపారు.

బుధవారం రాత్రి  బాధితురాలు మంపాడ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిందని,గడిచిన 9 నెలలుగా తను అనుభవించిన క్షోభ గురించి వివరించిందని తెలిపారు. లైంగిక దాడిలో మొత్తం 29మంది ఇందులో ఇన్వాల్ అయినట్లు బాధితురాలు తెలిపిందని చెప్పారు. కేసు నమోదుచేసిన వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 23మంది నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. పోస్కో, గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద నిందుతులపై కేసులు నమోదు చేపినట్లు ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక,నిందితులను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్లు పెరుగుతున్నాయి.

READ Punjab : ఆదిలోనే అమరీందర్ కి షాక్ ఇస్తున్న సీఎం చన్నీ