Fire Accident : తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శంకరాపురంలో ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి.

Fire Accident : తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Fire Accident (1)

A huge fire broke out in Tamil Nadu : తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శంకరాపురంలో ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.

మంటల్లో మరో 10 మంది చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రంగంలో దిగింది. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Petrol And Diesel Prices : తగ్గేదేలే…అక్టోబర్ లో 20 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.