Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

షాన్ బోగన్‌హల్లి ప్రాంతానికి చెందిన రాశి (20) అనే యువతి స్థానికంగా ఉన్న యెలహంక కాలేజీలో డిగ్రీ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పట్లాగే మంగళవారం కాలేజీకి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేశారు.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

Bengaluru: బెంగళూరులో డిగ్రీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిని ఇద్దరు దుండగులు దారి కాచి, గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో మంగళవారం సాయంత్రం జరిగింది.

Hunt Movie Trailer : చెరిగిపోయిన గతంలో ఎవిడెన్స్‌లు వెతుకుతున్న సుధీర్ బాబు.. ‘హంట్’ మూవీ ట్రైలర్ రిలీజ్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాన్ బోగన్‌హల్లి ప్రాంతానికి చెందిన రాశి (20) అనే యువతి స్థానికంగా ఉన్న యెలహంక కాలేజీలో డిగ్రీ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పట్లాగే మంగళవారం కాలేజీకి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేశారు. బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అనుసరిస్తూ వెళ్లారు. తర్వాత రాశిపై దాడి చేసి, ఆమె గొంతు కోశారు. తీవ్ర రక్తపు మడుగులో పడిపోయిన రాశిని వదిలేసి, బైకుపై పారిపోయారు. వెంటనే గుర్తించిన స్థానికులు రాశిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Pop Corn : ‘పాప్ కార్న్’ మూవీ నుంచి ‘మది విహంగమయ్యే’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన అక్కినేని నాగ చైతన్య

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న కూడా బెంగళూరు పరిధిలో ఇలాంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన ఒక కాలేజీలో చదువుకుంటున్న లయస్మిత అనే యువతిని, పవన్ కల్యాణ్ అనే యువకుడు హత్య చేశాడు. కత్తితో పొడవడంతో లయ స్మిత ప్రాణాలు కోల్పోయింది. ఒకే నెలలో ఇద్దరు విద్యార్థినులు, దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది.