Bihar Crime : గుక్కెడు నీళ్లు తాగాడని 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి..దెబ్బలు తాళలేక మృతి

దాహం వేసి బోరుపంపులో నీళ్లు తాగాడని 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేశారు కొంతమంది. దెబ్బలు తాళలేక బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

Bihar Crime : గుక్కెడు నీళ్లు తాగాడని 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి..దెబ్బలు తాళలేక మృతి

70 Year Old Man Dies Using Handpump

70 year old man dies after being beaten up for using handpump  : గుక్కెడి నీళ్లు తాగాడని ఓ వృద్ధుడికి అత్యంత దారుణంగా కొట్టిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. దాహం తీర్చుకోవటానికి ఓ బోరునీళ్లు తాగాడని 70 ఏళ్ల వృద్ధుడిని కొట్టిన ఘటన ఇది సభ్యసమాజమా? ఆటవిక సమాజమా? అనిపిస్తోంది. బిహార్‌లోని వైశాలి జిల్లా సేలంపుర్‌ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనకు ముసలిప్రాణం బలైపోయింది.

Read more : ఊరికోసం ఒకే ఒక్కడు..30 ఏళ్లు శ్రమించి కాలువ తవ్విన అపర భగీరథుడు

తమ అనుమతి లేకుండా బోరునీళ్లు తాగాడని 70ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు శనివారం (నవంబర్ 6,2021)తెల్లవారుజామున మృతి చెందాడు.దీంతో మృతుడు కొడుకు రమేశ్‌ సైని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తు.. ‘‘మా నాన్న పశువులకు గడ్డి తెవటానికి వెళ్లాడు. దాహం వేసి నీటి కోసం బోరుపంపు వద్దకు వెళ్లాడు. దీంతో తమ అనుమతి లేకుండా నీళ్లు తాగాడన్న కోపంతో బోరుపంపు యజమానులు మా నాన్నను అత్యంత దారుణంగా కొట్టారు. దెబ్బలు తాళలేక నా తండ్రి చనిపోయాడు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more :Bananas Flour : అరటితో అద్భుతాలు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు 

బోరుపంపు గల యజమానులకు మాకు ఎటువంటి విరోధం లేదు. కేవలం నీళ్లు తాగాడనే కారణంతోనే కొట్టారు అని మృతుడి కుమారుడు రమేశ్‌ సైని కన్నీరుపెడుతు తెలిపాడు. దీంతో తన తండ్రి మరణానికి కారణమైన బోరుపంపు యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు రమేశ్ సైని. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.