Punjab: పంజాబ్లో పాస్టర్ కారు దహనం చేసిన దుండగులు.. ఆ నేత వ్యాఖ్యలే కారణమా?
పంజాబ్లో ఒక పాస్టర్ కారును కొందరు దుండగులు దహనం చేశారు. చర్చిలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది.
Punjab: పంజాబ్లోని తార్న్ తరాన్ జిల్లాలోని పట్టి ఏరియాలో ఒక పాస్టర్కు సంబంధించిన కారును కొందరు దుండగులు దహనం చేశారు. అంతేకాదు.. ఆ పాస్టర్కు సంబంధించిన చర్చిలోకి చొరబడి అక్కడి వస్తువులను కూడా ధ్వంసం చేశారు.
Viral Video: ఇంత నిర్లక్ష్యమా.. అమెజాన్ పార్శిళ్లు విసిరేస్తున్న సిబ్బంది.. వీడియో వైరల్
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక పాస్టర్ బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నాడనే కారణంతో ఈ దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో అకాల్ తక్త్ అనే సంస్థ ఉంది. ఇది సిక్కులకు చెందిన సంస్థ. కొద్ది రోజుల క్రితం అమృత్సర్ జిల్లాలోని దదున్నా అనే గ్రామంలో క్రిస్టియన్ మిషనరీస్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిక్కులను, ఇతర మతస్తులను బలవంతంగా క్రిస్టియానిటీలోకి మారుస్తున్నారనే కారణంతో నిహంగ్స్ ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని అకాల్ తక్త్ సంస్థకు చెందిన నిహంగ్స్ అడ్డుకున్నారు. నిహంగ్స్ అంటే సిక్కు వారియర్లు.
Assam: తీవ్రవాదులతో లింకులు.. మదర్సాలు కూల్చివేస్తున్న అసోం సర్కార్
ఆయుధాలు ధరించి తమ ఉనికి కోసం పాటుపడతారు. బలవంతపు మత మార్పిడులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అకాల్ తక్త్ సంస్థకు చెందిన జాతేదార్ జియాని హర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పాస్టర్ కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
On camera: #Church vandalised in #Punjab, pastor’s #vehicle burnt; after forced conversion charge @TarnTaranPolice#PunjabNews #Viral #ViralVideo #Jesus #TarnTaran #Demolition #CCTV #CCTVFootage pic.twitter.com/RsQXBS1rD5
— Free Press Journal (@fpjindia) August 31, 2022