Data Theft : వామ్మో.. రూ.3వేలకు లక్ష మంది డేటా విక్రయం, 66కోట్ల మంది డేటా చోరీ కేసులో సంచలన నిజాలు

రూ.1200లకు 10వేల మంది డేటా, రూ.1500లకు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్షమంది డేటా విక్రయించిందీ ముఠా.

Data Theft : వామ్మో.. రూ.3వేలకు లక్ష మంది డేటా విక్రయం, 66కోట్ల మంది డేటా చోరీ కేసులో సంచలన నిజాలు

Data Theft : 66 కోట్ల మంది డేటా చోరీ కేసులో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. 1200 రూపాయలకు 10వేల మంది డేటాను అమ్మేశారు. రూ.1500లకు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్షమంది డేటా విక్రయించిందీ ముఠా.

ఈ డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు వినయ్ భరద్వాజ్ అనే ప్రదాన నిందితుడిని హర్యానాలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఏకంగా 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు సీజ్ చేశారు. మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన వారి డేటాను విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. 56 లక్షల మంది హైదరాబాదీల డేటా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఏపీ నుంచి 2 కోట్ల 10 లక్షల మంది వ్యక్తిగత వివరాలు చోరీ అయినట్లు గుర్తించారు.

Also Read..Data Theft Case : డేటా చోరీ కేసులో సంచలనం.. 16కోట్లు కాదు ఏకంగా 66కోట్ల మంది డేటా అమ్మేశాడు, ప్రధాన నిందితుడు అరెస్ట్

9,10,11,12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులతో పాటు 104 విభాగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల డేటాను అమ్మేసినట్లు నిర్ధారించారు. డేటా చోరీ కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సైబరాబాద్ డీసీపీ తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డేటా చోరీ కేసులో మరో వ్యక్తిని (ప్రధాన నిందితుడు) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకంగా 66.9 కోట్ల మందికి సంబంధించిన
వ్యక్తిగత వివరాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ ట్యాప్ లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 24 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల డేటాను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read..Massive Data Theft : షాకింగ్.. ఏపీలో 2కోట్ల మంది, హైదరాబాద్‌లో 56లక్షల మంది డేటా చోరీ

”66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాము. 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ చేశాడు. ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నాము. డేటా చోరీ కోసం 6 మెట్రోపాలిటిన్ సిటీల్లో 4.5లక్షల మంది ఉద్యోగులను భరద్వాజ్
నియమించుకున్నాడు.

డీ-మార్ట్‌, నీట్, పాన్‌కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్‌కంట్యాక్స్‌, డిఫెన్స్‌కు సంబంధించిన అధికారుల డేటా చోరీ చేశాడు. 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ చేశాడు. జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, పేటీఎం, ఫోన్‌ పే, బిగ్‌ బాస్కెట్‌, బుక్‌ మై షో, ఇన్‌స్టాగ్రామ్‌, జొమాటో, పాలసీ బజార్ సహా మరికొన్ని సైట్ల నుంచి డేటా చోరీ చేసి అమ్మేశారు. బై జ్యూస్‌, వేదాంత సంస్థల డేటా లీక్ చేశాడు” అని పోలీసులు వెల్లడించారు.