Crime News: అవివాహితపై నకిలీ స్వామీజీ ఐదేళ్లుగా అత్యాచారం.. భార్యతో వీడియోలు తీయించి బెదిరింపు..

ఓ నకిలీ స్వామీజీ అవివాహితపై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పూజా సమయంలో ఇచ్చే పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను తన భార్యతో వీడియో తీయించి నిత్యం బెదిరించి లొంగదీసుకుంటున్నాడు.

Crime News: అవివాహితపై నకిలీ స్వామీజీ ఐదేళ్లుగా అత్యాచారం.. భార్యతో వీడియోలు తీయించి బెదిరింపు..

Fake Swamiji raped a young woman

Crime News: ఓ నకిలీ స్వామీజీ అవివాహితపై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పూజా సమయంలో ఇచ్చే పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను తన భార్యతో వీడియో తీయించి నిత్యం బెదిరించి లొంగదీసుకుంటున్నాడు. చివరికి ఆ అవివాహిత ఓ లాయర్ సహాయంతో పోలీసులను ఆశ్రయించి నకిలీ స్వామీజీ గుట్టువిప్పింది. ఈ ఘటన బెంగళూరులోని ఆవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

CBI Raids: బిహార్‌లో సీబీఐ దాడులు.. పలువురు ఆర్జేడీ నేతల నివాసాల్లో సోదాలు
వివాహం కాకపోవడంతో కుటుంబ సభ్యుల సూచనలతో ఐదేళ్ల క్రితం ఆనందమూర్తిని కలిసినట్లు బాధితురాలు వివరించింది. అయితే ఆయన పూజ చేస్తున్న సమయంలో ఇచ్చిన పానీయంతో స్పృహ కోల్పోయిన తరువాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తన భార్యచే ఫోన్ లో వీడియో రికార్డు చేయించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియో చూపిస్తూ తనను నిత్యం బెదిరించేవాడని, తనకు లొంగకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించేవాడని, అలా తనపై ఐదేళ్లుగా అత్యాచారంకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసుల ఎదుట వాపోయింది.

Two Marriages : భలే ఛాన్సులే.. ఆ దేశంలో అబ్బాయిలు రెండో పెళ్లి చేసుకోవాల్సిందే…లేకపోతే జైలుకే

గత మూడేళ్లుగా తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, అయితే వాటినిసైతం వీరు చెడగొడుతూ నన్ను తీవ్ర మానసిక క్షోభ అనుభవించేలా చేశారని, అంతేకాక తన వద్ద లక్ష రూపాయల నగదు తీసుకున్నారని బాధితురాలు తెలిపింది. ఇటీవల యువతి పెళ్లి ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం ఒక్కరోజు ముందు రద్దయింది. పెళ్లి రద్దు కావడానికి ఆనందమూర్తి స్వామీజీ, అతని భార్య లతా కారణం అని యువతి గుర్తించింది. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురి మీద ఆనందమూర్తి రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో, ఫోటోలను నకిలీ స్వామీజీ, అతని భార్య లతా చూపించారని తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు హడలిపోయారు. దీంతో తన న్యాయవాధి జ్ఞానేశ్ సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.