Crime News : నల్గొండ జిల్లాలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. తండ్రి ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమించి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నూనవత్ తండాలో జరిగింది.

Crime News : నల్గొండ జిల్లాలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. తండ్రి ఆత్మహత్య

Crime News

Crime News : నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమించి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నూనవత్ తండాలో జరిగింది. తండాకు చెందిన కిషన్ నాయక్, తన కుమారులు హర్షవర్ధన్ (8) అఖిల్ (6)తో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళాడు. అక్కడే పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడు. ఆ తర్వాత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చదవండి : Nalgonda Crime : పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకొని.. మూడు నెలలకే ఆత్మహత్య

స్థానికులద్వారా సమాచారం అందుకున్న వాడపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల వల్లే కిషన్ ఈ విధంగా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చదవండి : Nalgonda : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం