Haryana : డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్ట్.. ఎన్‌కౌంటర్‌లో దిగిన బుల్లెట్

హర్యానాలో ఈరోజు ఉదయం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Haryana : డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్ట్.. ఎన్‌కౌంటర్‌లో దిగిన బుల్లెట్

Haryana Dsp Killing

Haryana :  హర్యానాలో ఈరోజు ఉదయం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ ను పోలీసులు  అరెస్ట్ చేశారు.  అతడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో డ్రైవర్ కాలికి బుల్లెట్   గాయం అయ్యింది. నిందితుడిని ఇక్కార్ గా పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్ ను చికిత్స కోసం నల్హార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.

నూహ్  లోని రాతి గనుల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై  మేవాత్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌ విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం తావడూ సమీపంలోని పంచగావ్ వద్దకు వెళ్లగా అక్కడ ఒక  లారీని ఆపేందుకు ఆయన ప్రయత్నించారు. డ్రైవర్  లారీని ఆపకుండా   ఆయన్ను ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో బిష్ణోయ్ అక్కడికక్కడే మరణించారు.

సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. వెంటనే నిందితుడి  కోసం గాలింపు చేపట్టి కొద్ది గంటల్లోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో డ్రైవర్   కాలికి గాయం అయ్యింది. మిగిలిన   నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ  పీకే అగర్వాల్ తెలిపారు.

Also Read : Shaktimaan : శక్తి‌మాన్ లా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి-పోలీసుల హెచ్చరిక