Hyderabad: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఘాతుకం

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఆమెపై రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Hyderabad: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఘాతుకం

Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన యువకులు, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గత సోమవారం రాత్రి నాంపల్లి పరిధిలో జరిగింది.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ప్రభుత్వ నిర్ణయం

పోలీసులు, బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి బాలిక తల్లికి అనారోగ్యంగా ఉండటంతో మందుల కోసం పదమూడేళ్ల కూతురును మెడికల్ షాప్‌కు పంపింది. బయటకు వెళ్లిన బాలికను కొందరు యువకులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తర్వాత ఇంజెక్షన్ ద్వారా మత్తు మందు ఇచ్చారు. అనంతరం దగ్గర్లోని ఒక ఓయో లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను చాదర్‌ఘాట్ ప్రాంతంలో వదిలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న బాలికను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. బాలిక పరిస్థితి చూసి విషయం ఆరాతీయగా, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలిసింది.

Serial Killer: జైల్లో సీరియల్ కిల్లర్.. భయపడుతున్న తోటి ఖైదీలు

వెంటనే బాలిక కుటుంబ సభ్యులు డబీర్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. వారిని నియామత్, రిషబ్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. కాగా, ఘటనకు ముందే బాలిక కుటుంబ సభ్యులు తను కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.