Hyderabad : అందరు చూస్తుండగానే హైకోర్టు వద్ద వ్యక్తి హత్య..

పట్టపగలు కత్తులతో దాడులు చేసి హత్యలు చేస్తున్న ఘటనలో నగరంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానాలకు సమీపంలో కూడా ఈ దారుణ హత్యలు జరగుతుంటే ఇక భద్రతకు చోటెక్కడ? అనే ఆందోళనలు కలిగిస్తున్నాయి నగరవాసులకు.

Hyderabad : అందరు చూస్తుండగానే హైకోర్టు వద్ద వ్యక్తి హత్య..

Hyderabad

Hyderabad: విశ్వనగరంగా పేరొందుతున్న హైదరబాద్ నగరంలో పట్టపగలే జరుగుతున్న హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టపగలు కత్తులతో దాడులు చేసి హత్యలు చేస్తున్న ఘటనలో నగరంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానాలకు సమీపంలో కూడా ఈ దారుణ హత్యలు జరగుతుంటే ఇక భద్రతకు చోటెక్కడ? అనే ఆందోళనలు కలిగిస్తున్నాయి నగరవాసులకు. ఈక్రమంలో గురువారం (మే 4,2023) సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు సమీపంలోనే ఓ వ్యక్తి అందరు చూస్తుండగానే హత్య చేసిన దర్జాగా అక్కడనుంచి పారిపోయిన ఘటన చోటుచేసుకుంది.

Uganda : మంత్రిని కాల్చి చంపిన సైనికుడు .. ఎందుకంటే..

హైకోర్టు గేట్‌ నంబర్‌ 6 వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. జనం చూస్తుండగానే ఈ హత్య జరిగింది. ఆ తరువాత హత్య చేసిన వ్యక్తి తాపీగా అక్కడనుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ హత్య డబ్బుల కోసం జరిగినట్లుగా సమాచారం. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిన ఈ హత్యకు దారి తీసినట్లుగా సమాచారం. చాలామంది చూస్తుండగానే ఈ హత్య జరగటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆ పరిసరాలన పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.