Woman Kills Husband : దృశ్యం సినిమా తరహా మర్డర్.. భర్తను చంపి శవాన్ని పూడ్చి సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించిన భార్య

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను కూలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో వ్యక్తులు హంతకులుగా మారుతున్నారు. ప్రియుడి మోజులో భార్య, ప్రియురాలి మోజులో భర్త.. కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. చేతులారా తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. చివరికి జైలు పాలవుతున్నారు. పిల్లలను అనాథలుగా మారుస్తున్నారు.

Woman Kills Husband : దృశ్యం సినిమా తరహా మర్డర్.. భర్తను చంపి శవాన్ని పూడ్చి సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించిన భార్య

Woman Kills Husband : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను కూలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో వ్యక్తులు హంతకులుగా మారుతున్నారు. ప్రియుడి మోజులో భార్య, ప్రియురాలి మోజులో భర్త.. కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. చేతులారా తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. చివరికి జైలు పాలవుతున్నారు. పిల్లలను అనాథలుగా మారుస్తున్నారు.

ప్రియుడి మోజులో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా ఖతర్నాక్ స్కెచ్ వేసింది. భర్త శవాన్ని పూడ్చి దానిపై సెప్టిక్ ట్యాంక్ నిర్మించింది. కానీ, ఆమె పాపం పండింది. అడ్డంగా దొరికిపోయింది. కటకటాల పాలైంది. దృశ్యం సినిమాలోని మర్డర్ సీన్ ను తలపించే ఈ షాకింగ్ క్రైమ్ ఇన్సిడెంట్ నోయిడాలో చోటు చేసుకుంది.

Also Read..Wife Killed Husband : వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు విషం కలిపిన అన్నం ఇచ్చి చంపిన భార్య

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కి చెందిన సతీష్‌, నీతూ దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. సతీష్ తన భార్య, కొడుకుతో గ్రేటర్ నోయిడాకి వచ్చాడు. సరస్వతి కుంజ్‌ లో ఇంటిని నిర్మించుకోవాలని భావించాడు. ఆ ఇంటి నిర్మాణ పనులను హర్పాల్ అనే తాపీ మేస్త్రీకి అప్పగించాడు. ఈ వ్యక్తి ఎంట్రీతో వారి సంసారం చిన్నాభిన్నం అయ్యింది.

సతీష్ భార్య నీతూ, హర్పాల్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సతీష్ ఇంట్లో లేని సమయంలో మేస్త్రీతో రాసలీలలు కొనసాగించింది నీతూ. అయితే, ఈ విషయం భర్తకు తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని ఆమె భయపడింది. తన ప్రియుడితో సుఖంగా ఉండాలని భావించిన ఆమె.. భర్తను లేపేయాలని నిర్ణయించింది. భర్త అడ్డు తొలగించుకున్నాక ప్రియుడిని పెళ్లి చేసుకుని జీవితాంతం అతడితో సుఖంగా ఉండాలని భావించింది నీతూ. భర్తను చంపాలని డిసైడ్ అయిన నీతూ.. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.

Also Read..SI Killed Husband: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని.. దారుణానికి పాల్పడిన మహిళా ఎస్ఐ

పథకం ప్రకారం.. జనవరి 2న తన ప్రియుడితో కలిసి ఒక డ్రింక్‌లో మత్తుమందు కలిపి భర్తతో తాగించింది. అది తాగిన సతీష్ స్పృహ కోల్పోయాడు. అంతే, ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపేసింది భార్య నీతూ. ఆ తర్వాత ఎవరికీ ఎలా అనుమానం రాకుండా మరో ఖతర్నాక్ ప్లాన్ వేసింది. మృతదేహాన్ని పొరుగున నిర్మాణంలో ఉన్న ఇంటికి తరలించింది. అక్కడ శవాన్ని పాతిపెట్టింది. దాని పైనే ఆ మేస్త్రీ సెప్టిక్ ట్యాంక్‌ నిర్మించాడు. ఇక, తాము చేసిన నేరం ఎప్పటికీ బయటపడదని వారు భావించారు.

కాగా, సతీష్ కనిపించకుండా పోవడంతో అతని సోదరుడు జనవరి 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. భార్య నీతూపై వారికి ఎక్కడో డౌట్ వచ్చింది. అంతే, తమదైన స్టైల్ లో ఆమెను ప్రశ్నించారు. దీంతో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వివాహేతర బంధం మోజులో ప్రియుడితో కలిసి తన భర్తను భార్య నీతూనే మర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో నీతూ నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ నుంచి వెలికితీశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివాహేతర సంబంధం మోజులో ఆమె తన సంసారాన్ని తానే నాశనం చేసుకుందని కుటుంబసభ్యులు వాపోయారు.