Nalgonda Land Dispute : పంట పొలాల్లో దారుణం.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపే ప్రయత్నం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు మండలం మునుకుంట్లలో భూ వివాదం నేపథ్యంలో పంట పొలంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నం జరిగింది.

Nalgonda Land Dispute : పంట పొలాల్లో దారుణం.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపే ప్రయత్నం

Nalgonda Land Dispute : నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు మండలం మునుకుంట్లలో భూ వివాదం నేపథ్యంలో పంట పొలంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నం జరిగింది.

కొంత కాలంగా మునుకుంట్ల గ్రామానికి చెందిన రవీందర్, విజయ్, సుధాకర్ ల మధ్య భూ వివాదం ఉంది. విజయ్, సుధాకర్ గురువారం పొలాన్ని దున్నతుండగా.. రవీందర్ అడ్డుకున్నారు. దీంతో రవీందర్ ను ట్రాక్టర్ తో తొక్కి చంపేందుకు యత్నించారు. ట్రాక్టర్ ముందు భాగం పట్టుకుని రవీందర్ చాలాసేపు వేలాడాడు.

Also Read..Rapist Jalebi Baba : బాబోయ్.. ఈ జిలేబీ బాబా మామూలోడు కాదు, ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం

ఇదంతా మొబైల్ లో వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రవీందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. దీనిపై పలుమార్లు పంచాయితీ జరిగింది. ఎవరు కూడా ఆ పొలాల్లో సాగు చేయొద్దని పంచాయితీ పెద్దలు చెప్పారు. అయితే, ఇవాళ విజయ్, సుధాకర్ ట్రాక్టర్ తో పొలాన్ని దున్నేందుకు వచ్చారు. పొలాన్ని దున్నుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రవీందర్ అతడి కుటుంబసభ్యులు.. అక్కడికి చేరుకున్నాడు. పొలాన్ని దున్నడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Also Read..Cyber Crime: సైబర్ ఉచ్చులో కామారెడ్డి వాసి.. లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు

పొలం దున్నడాన్ని ఆపాలని రవీందర్ కోరాడు. ఎంత విజ్ఞప్తి చేసినా పొలం దున్నడాన్ని ఆపలేదు. దీంతో రవీందర్.. ట్రాక్టర్ కు అడ్డంగా నిలబడ్డాడు. అయినా వాళ్లు లెక్క చేయలేదు. అడ్డంగా నిలబడిన రవీందర్ పైనుంచి ట్రాక్టర్ ను పోనిచ్చే ప్రయత్నం సుధాకర్ చేశాడు. దీంతో రవీందర్ ట్రాక్టర్ ముందు భాగాన్ని అలాగే పట్టుకున్నాడు. అతడి కిందపడిపోవాలని సుధాకర్ ట్రాక్టర్ ని వేగంగా పోనిచ్చాడు. దీన్ని రవీందర్ కుటుంబసభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అసలక్కడ ఏం జరిగింది? హత్యాయత్నం జరిగిందా? అనే విషయాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.