Hyderabad : పుడింగ్ ఇన్ మింక్ పబ్ కేసులో సంచలన విషయాలు.. డ్రగ్స్ తీసుకున్న 20మంది వీఐపీలు
పుడింగ్ ఇన్ మింక్ పబ్లో 20మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. మేనేజర్ అనిల్, అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు ఖాకీలు తేల్చారు.
Pudding Inn Mink Pub : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20మంది డ్రగ్స్ తీసుకున్నారు. పుడింగ్ ఇన్ మింక్ పబ్లో 20మంది వీఐపీలు కొకైన్ పీల్చి మత్తులో ఊగిపోయారు. పోలీసుల విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ 20 మందికి నోటీసులు ఇచ్చి.. విచారణకు పిలవాలని ఖాకీలు నిర్ణయించారు.
డ్రగ్స్ తీసుకున్న వీఐపీలు ఎవరు? ఆ 20మంది పేర్లు ఏంటి? ఇప్పుడిదే హాట్ టాపిక్. పోలీసుల నుంచి నోటీసులు అందుకుబోయే 20మంది ఎవరన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. వీరందరికీ పోలీసులు నోటీసులు ఎప్పుడిస్తారు? విచారణకు ఎప్పుడు పిలుస్తారు? వీరిలో ఎంతమంది పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తారన్నది తేలాల్సి ఉంది.
Hyderabad : పుడింగ్ ఇన్ మింక్ పబ్ కేసులో ఆసక్తికర విషయాలు
పుడింగ్ ఇన్ మింక్ పబ్లో 20మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. మేనేజర్ అనిల్, అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు ఖాకీలు తేల్చారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్లో గోవా, ముంబైకి చెందిన కొందరు వ్యక్తులున్నట్లు గుర్తించారు.
గతంలో డ్రగ్స్తో పట్టుబడ్డ పెడ్లర్స్తో మేనేజర్ అనిల్కు లింకులున్నట్లు కూడా పోలీసులకు తెలిసింది. గోవా, ముంబై నుంచి అనిల్ డ్రగ్స్ తెప్పించినట్లు ఆధారాలు లభ్యం కావడంతో.. అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.