Murder: చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడి హత్య

మరో చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని హత్య చేశాడో మందుబాబు. తాగిన మత్తులో దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో మంగళవారం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Murder: చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడి హత్య

Murder

Murder: చపాతీ అడిగితే ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మున్నా (40) అనే రిక్షా కార్మికుడు గత మంగళవారం రాత్రి పది గంటల సమయంలో స్థానిక విష్ణు మందిర్ మార్గ్ దగ్గర హోటల్ నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్నాడు.

Monkeypox Vaccine: మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. తయారీ కంపెనీలకు ఐసీఎమ్ఆర్ ఆహ్వానం

అప్పుడే బాగా మద్యం తాగి ఉన్న ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఇవ్వాలి అని భోజనం చేస్తున్న మున్నాను అడిగాడు. అప్పుడు మున్నా ఒక చపాతి ఇచ్చాడు. అది తిన్న తర్వాత ఫిరోజ్ ఖాన్ మరో చపాతి అడిగాడు. దీనికి మున్నా నిరాకరించాడు. దీంతో మున్నాను తిడుతూ ఫిరోజ్ ఖాన్ అతడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో మున్నాను పొడిచాడు. దీంతో అక్కడే మున్నా కుప్పకూలిపోయాడు. తర్వాత ఫిరోజ్ ఖాన్ అక్కడ్నుంచి పారిపోయాడు. కొందరు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ, అక్కడ్నుంచి తప్పించుకుపోయాడు. తర్వాత మున్నాను ఆటోలో స్థానిక ఆసుపత్రికి చేర్చారు.

Arpita Mukherjee: అర్పిత మరో ఫ్లాట్ నుంచి 29 కోట్లు స్వాధీనం

కానీ, అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నిందితుడి గురించి వెతికారు. తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు.