Secunderabad Fire Accident : ఆ ముగ్గురు ఎక్కడ..? సికింద్రాబాద్ అగ్నిప్రమాద బిల్డింగ్‌లో డ్రోన్లతో గాలింపు

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ దొరక్కపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. బిల్డింగ్ నుంచి వేడి సెగలు వెలువడుతుండటంతో పాటు పొగలు కమ్మేయడంతో భవనం లోపలికి క్లూస్ టీమ్ వెళ్ల లేకపోతోంది.(Secunderabad Fire Accident)

Secunderabad Fire Accident : ఆ ముగ్గురు ఎక్కడ..? సికింద్రాబాద్ అగ్నిప్రమాద బిల్డింగ్‌లో డ్రోన్లతో గాలింపు

Secunderabad Fire Accident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ దొరక్కపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. బిల్డింగ్ నుంచి వేడి సెగలు వెలువడుతుండటంతో పాటు పొగలు కమ్మేయడంతో భవనం లోపలికి క్లూస్ టీమ్ వెళ్ల లేకపోతోంది. దీంతో అధికారులు డ్రోన్లను రంగంలోకి దింపారు. డ్రోన్ల ద్వారా బిల్డింగ్ లోపలి పరిస్థితులను అంచనా వేస్తోంది క్లూస్ టీమ్. డ్రోన్ ను భవనం లోపలికి పంపి ఆధారాలు సేకరిస్తోంది.

అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ ను వరంగల్ నిట్ డైరెక్టర్ రమణారావు పరిశీలించారు. భవనం నాణ్యత, స్ట్రక్చర్ ను పరిశీలించారు. భవనం చాలా వీక్ గా ఉందన్నారు. భవనాన్ని కూల్చితే పక్కనున్న భవనాలను ప్రమాదం కలిగే అవకాశం ఉందన్నారు నిట్ డైరెక్టర్ రమణారావు.

Also Read..Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు

మరోవైపు సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ అగ్నిప్రమాదం ఘటన.. సెంటర్ వర్సెస్ స్టేట్ గా మారుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జనావాసాల మధ్య ఇంత పెద్ద ప్రమాదం జరగడం ప్రభుత్వం తక్కువ అంచనా వేయడమే అన్నారు కిషన్ రెడ్డి. గోడౌన్లు, అనధికార నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.(Secunderabad Fire Accident)

కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ లో ప్రధాని మోదీ ఉన్న సమయంలోనే వంతెన కూలిపోయి చాలా మంది చనిపోయారని, కిషన్ రెడ్డిలా బాధ్యత లేకుండా గాలి మాటలు మేము మాట్లాడలేదన్నారు మంత్రి తలసాని. వంతెన కూలిన ఘటనకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని మేము అన్నామా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు.

Also Read..Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. అదుపులోకి వచ్చిన మంటలు

సికింద్రాబాద్‌ రాంగోపాల్ పేట మినిస్టర్‌ రోడ్డులో ఉన్న ఆరు అంతస్తుల డెక్కన్ మాల్ భవనం అగ్నికి ఆహుతైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు సెల్లార్లతో కూడిన జి+5 భవనంలోని డెక్కన్‌ స్పోర్ట్స్‌ నిట్‌వేర్‌ మాల్‌లో గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వరకూ మంటలు కొనసాగాయి. చుట్టుపక్కల సుమారు 20 భవనాలపై ప్రభావం పడింది. వందల మంది ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేసి పరుగులు తీశారు. డెక్కన్‌ మాల్‌కు ఎడమవైపు ఉన్న నల్లగడ్డ బస్తీలోని 20 ఇళ్లు మంటల ధాటికి స్వల్పంగా దెబ్బతిన్నాయి.

డెక్కన్‌ స్పోర్ట్స్‌ నిట్‌వేర్‌ మాల్‌ అగ్నిప్రమాదం ఘటనలో సంస్థలో పనిచేసే వసీం(36), జునైద్‌ (32), జహీర్‌(22)లు కనిపించకుండా పోయారు. భవన యజమానులు మహ్మద్‌ ఒవైసీ, ఎంఏ రహీం తదితరుల నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.(Secunderabad Fire Accident)

ఓ సెల్లార్‌లో స్పోర్ట్స్ డ్రెస్ ల తయారీ యూనిట్‌ ఉంది. మరో సెల్లార్‌లో కార్ల డెకరేషన్ దుకాణం నడుస్తోంది. టన్నుల కొద్దీ దుస్తులను యజమాని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంచి అమ్ముతున్నారు. ఒకటి, రెండు అంతస్తులను వస్త్ర గోడౌన్ గా ఉపయోగిస్తున్నారు. 3వ అంతస్తును ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

4, 5 అంతస్తులను నివాసంగా వాడుకునేందుకు ఇటీవల పనులు చేపట్టారు. సెల్లార్‌లోని వస్త్రాల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనా. మొత్తం 29 ఫైరింజన్ల సాయంతో మంటలను అతి కష్టమ్మీద అదుపులోకి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపారం నిర్వహించడంతో పాటు పార్కింగ్‌ స్థలంలో కార్ల అలంకరణ సామగ్రి, దుస్తుల కార్టన్లను పేర్చారు. ఈ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలే లేవని పోలీసుల విచారణలో బయటపడింది.(Secunderabad Fire Accident)