Viral Video : షాకింగ్.. చేతులు కడుక్కుంటున్న యువకుడిని ఢీకొట్టిన రైలు, స్పాట్లోనే మృతి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో
Malad Railway Station : రైల్వే స్టేషన్ లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.

Malad Railway Station (Photo : Google)
Malad Railway Station : రైల్వే స్టేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. పట్టాలు దాటే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ప్లాట్ ఫామ్ ల మీద కూడా కేర్ ఫుల్ గా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ పాటించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం.
ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. యువకుడిని రైలు ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్ ఫామ్ 3పై మయాంక్ అనిల్ శర్మ (17) అనే యువకుడు చేతులు కడుక్కుంటున్నాడు. అదే సమయంలో ఓ రైలు చాలా వేగంగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. అయితే అతడు రైలు రాకను గమనించలేదు. యువకుడిని రైలు బలంగా ఢీకొట్టింది. అంతే రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ట్రైన్ ఢీకొట్టడంతో యువకుడు గాల్లో ఎగిరిపడ్డాడు. స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు. అనిల్ చేతులు కడుక్కుంటూ ఉండగా రైలు ఢీకొట్టడం రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ యాక్సిడెంట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్లాట్ ఫామ్ పై ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా టిఫిన్ తిన్నారు. ఓ కుర్రాడు పైకి లేచి ప్లాట్ ఫామ్ చివరగా వెళ్లి చేతులు కడుక్కున్నాడు. ఇంతలో అతడి ఫ్రెండ్ అనిల్ కూడా చేతులు కడుక్కోవడానికి ప్లాట్ ఫామ్ అంచువరకు వెళ్లాడు. మరో స్నేహితుడు తన చేతులు కడుక్కుని వాటర్ బాటిల్ లోని నీరు తాగి. ఆ తర్వాత బాటిల్ ని అనిల్ కు ఇచ్చాడు.
అనిల్ తన చేతులు వాష్ చేసుకుంటున్నాడు. అయితే, వారు రైలు వస్తుండటాన్ని గమనించలేదు. దాంతో ఘోరం జరిగిపోయింది. రైలు రాకను గుర్తించిన మరో యువకుడు వెనక్కి జరిగి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కాగా, అనిల్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ తో పాటు అప్పటివరకు అక్కడే ఉండి చేతులు వాష్ చేసుకున్న యువకుడు కూడా ఎగిరిపడ్డాడు. అయితే అతడు వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో ఉన్న ఈ ప్రమాదం జూన్ 17న జరిగింది. తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్లాట్ ఫామ్ 3పై నిల్చుని ఉండగా.. పట్టాలపై వేగంగా వచ్చిన ఏసీ లోకల్ ట్రైన్ అతడిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. అందుకే రైల్వే స్టేషన్ లలో చాలా జాగ్రత్తతగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.
Mumbai | The accident took place when he was standing to wash a lunch box on platform 3 of Mumbai’s Malad railway station when he was hit by a sudden fast local. A 17-year-old youth died on the spot in this accident. Mayank Anil Sharma is the name of the youth who died in the… pic.twitter.com/GSaP24H3uQ
— ℝ?? ???? (@Rajmajiofficial) June 30, 2023