Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడిని నరేంద్రుని చిరు సాయిగా గుర్తించారు. సాయిది సూర్యాపేట. జాబ్ ముగించుకుని రూమ్ కి వెళ్తున్న సమయంలో సాయి ప్రయాణిస్తున్న

Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

Road Accident

Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడిని నరేంద్రుని చిరు సాయిగా గుర్తించారు. సాయిది సూర్యాపేట. జాబ్ ముగించుకుని రూమ్ కి వెళ్తున్న సమయంలో సాయి ప్రయాణిస్తున్న కారుని టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

వేగంగా వచ్చిన టిప్పర్ కారుని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో నరేంద్రుని చిరు సాయి స్పాట్ లోనే మృతి చెందాడు. అమెరికాలోని ఒహియో స్టేట్ లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో సాయితో ప్రయాణిస్తున్న మరొకరు కోమాలోకి వెళ్లిపోయారు. చిరు సాయి మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Siva Shankar Master: కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూత

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే బీజేపీ నేతలు సాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని భారత్ కు త్వరగా తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. సాయి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.